Search

ప్రత్యక్ష గుడారంలోని పవిత్రత మరియు ఆచారాలకు ప్రయాణం

" దాతృత్వం చేయడానికి ప్రేరేపించబడిన ప్రతి వ్యక్తినుండి, మీరు నా అర్పణను తీసుకోవాలి" అని చెప్పబడిన విధంగా  ప్రతి వ్యక్తి యొక్క స్వచ్ఛంద విరాళాల నుండి గుడారాన్ని నిర్మించాలని చెప్పే పరషత్ తృమా లోని వాక్యంతో పోల్చినప్పుడు, పరాషత్ తెట్జావేలో, మనకు ఒక ఆజ్ఞఇవ్వబడింది! "మరియు మీరు ఇశ్రాయేలు సంతతికి ఇలా ఆజ్ఞాపించండి" - ఇకపై ప్రజల స్వచ్ఛంద విరాళాలపై ఆధారపడకుండా వారికి ఆజ్ఞాపించాల్సిన అవసరం ఉంది. బంగారం, వెండి, నీలం మరియు ఊదారంగు నూలు వంటి విరాళంగా తెచ్చిన వాటికి మరియు ఇతర  వస్తువులకు మధ్య వ్యత్యాసం ఉంది, ఇవన్నీ చాలా సంవత్సరాలు గుడారంలోనే  ఉంటాయి. ఇది పాడైపోయే వస్తువుల గురించి మాట్లాడే పర్షత్ తెట్జావేకి భిన్నమైన విషయం. ఉదాహరణకు, మెనోరాలో పోసే నూనె. దీనిలో ప్రతి రోజు, తాజా నూనెను తప్పనిసరిగా పోయాలి. దానం చేసేటప్పుడు ప్రజలు సహజంగా మొగ్గుచూపే విషయం యేమిటంటే, ఉదాహరణకు, ఒక భవనం నిర్మించి దానిపై దాత పేరు వ్రాయబడటం. అయితే  భోజన ఖర్చు చెల్లించాలి అంటే మాత్రం అది నేటికీ ఉంటుంది మరునాటికి ఉండదు కాబట్టి అది కొంచం కష్టమైన విషయమే. ఇక్కడ, ప్రజలు పవిత్రతలో పాల్గొనడానికి తక్కువ స్థాయి సంసిద్ధత కలిగివుండడం  గురించి పరషత్  తెట్జావే మాట్లాడుతున్నందున ఒక ఆజ్ఞ ఇవ్వడం అవసరమైంది. లేదు, ఎందుకంటే వచనం ఏమి చెబుతుంది? "మరియు వారు నీకు  స్వచ్ఛమైన ఒలీవ  నూనెను తీసుకువస్తారు." అంటే, నీవు మొదట ఆజ్ఞాపిస్తావు. అయినప్పటికీ, నీవు ఇశ్రాయేలు సహజమైన ఔదార్యాన్ని తిరిగి మేల్కొల్పావు, "మరియు వారు నిరంతరం దీపములను వెలిగించుటకు దంచి తీసిన  స్వచ్ఛమైన ఒలీవ నూనెను మీ వద్దకు తెచ్చేదరు," కాబట్టి విద్యా వ్యూహం కూడా ఉంది. మనము ఆజ్ఞతోనూ మరియు నెమ్మదిగాను  ప్రారంభించాము. 

అతను మళ్ళీ దాతృత్వం చేస్తున్నాడు. పరషత్ తెరుమాలో కలపబడిన ఒక భాగాన్ని మనం ఇంకా కనుగొనవలసిన అవసరం ఉంది: అదే ధూపవేదిక. ప్రత్యక్ష గుడారంలో ధూపము వేయబడి ఉంది; ఈ పరిమళ ధూపము ఏమి అందిస్తుంది? ఇది మంచి వాసనను ఇస్తుంది. అంటే, మనిషిని పవిత్రతకు అనుసంధానించడానికి వ్యక్తిగతమైన ప్రేరణలు అవసరం. అతనికి గౌరవం మరియు కీర్తి కోసం యాజక వస్త్రాలు అవసరం. ఊహ కార్యరూపం దాల్చడం ద్వారా  మరియు బట్టలు యొక్క వాసన ద్వారా వచ్చే పవిత్రతతో సంబంధం ఉంది; మేధో పరమైన పని సంతృప్తికరంగా లేని వ్యక్తికి పరషత్ తెట్జావేలో ఇవన్నీ కొత్తగా ఉంటాయి, అటువంటి వ్యక్తికి ఊహ చర్యారూపం దాల్చడం కూడా అవసరం.

More Weekly Portions

దైవిక మార్గదర్శకత్వం మరియు మానవ స్వరాలు: న్యాయ విధుల ఏర్పాటు

పరషత్ పీనెహాసు లో, సెలోపెహదు కుమార్తెలు యూదుల వారసత్వ చట్టాలలో ఒక కీలకమైన మార్పును ప్రేరేపించారు, ఇది కుమారులు లేనప్పుడు కుమార్తెలు వారసత్వంగా పొందడానికి అనుమతించే కొత్త ఆదేశాలకు దారితీసింది. ఈ కథనం దైవ మార్గదర్శకత్వం మరియు ప్రజల చొరవ మధ్య క్రియాశీలకమైన పరస్పర చర్యను వివరిస్తుంది. మొదట్లో అస్పష్టంగా ఉన్న మోషేకు, కుమార్తెలు ఆందోళన వ్యక్తం చేసిన తర్వాతే హాషెమ్ గారి నుండి నుంచి ఆదేశాలు అందాయి. ఈ కథ, ఇలాంటి వ్యాజ్యాలతో పాటు, మతపరమైన విచారణ మరియు ప్రతిస్పందన ద్వారా యూదుల చట్టం మరియు దైవ వెల్లడి యొక్క పరిణామంలో ప్రజల పాత్ర యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది.

ప్రశంస మరియు అసూయ : బాలాము ప్రవచనము లోని ద్వంద్వ స్వభావం

పరషత్ బాలక్‌లో, దేశాలలో ప్రసిద్ధి చెందిన ప్రవక్త అయిన బిలామ్ ఇశ్రాయేల్ పట్ల అభిమానం మరియు అసూయ యొక్క సంక్లిష్ట మిశ్రమాన్ని కలిగి ఉన్నాడు. ఇశ్రాయేల్ ను  శపించాలనే ఉద్దేశ్యంతో, అతను చివరికి వారిని ఆశీర్వదిస్తాడు, దైవిక ప్రేరణ మరియు ప్రవచనం యొక్క ప్రభావాన్ని వివరిస్తాడు. ఈ విరుద్ధమైన వైఖరి యూదు వ్యతిరేకత యొక్క విస్తృత థీమ్‌లను మరియు ఇష్టపడే పిల్లల మనోవిశ్లేషణ ప్రతిస్పందనను ప్రతిబింబిస్తుంది. తోరా విశ్వాసాన్ని నొక్కిచెబుతుంది, ఎందుకంటే ప్రార్థనా మందిరంలో మననం చేసే ప్రవచనం,యావత్ మానవాళిపై బలమైన దైవిక ప్రభావాన్ని సూచిస్తుంది, పవిత్రాత్మ పొందుకోవడానికి సర్వమానవాలికీ వున్న అవకాశాన్ని మిడ్రాష్ తన్నా దెబే ఎలియాహు యొక్క దృక్పథం ద్వారా నొక్కిచెబుతుంది.

మరణం నుండి నిత్యత్వం వరకు: శుద్ధికరణకు ఎర్రని పెయ్య మార్గము

పర్షత్ హుకత్ లో, ఎర్ర ఆవు (పారా అదుమా) ఆచారం మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షం యొక్క పాపంలో పాతుకుపోయిన మరణం యొక్క మలినాల నుండి శుద్ధిని సూచిస్తుంది. ఈ ఆచారంలో బూడిదను సజీవ నీటితో కలపడం, శరీరానికి మరియు ఆత్మకు ప్రాతినిధ్యం వహించడం, పునరుత్థానం ద్వారా జీవిత పునరుద్ధరణను వివరించడం జరుగుతుంది. ఈ ప్రక్రియ, దాని ప్రతీకాత్మక స్పష్టత ఉన్నప్పటికీ, ఒక దైవిక రహస్యాన్ని నొక్కిచెబుతుంది - జీవితం మరియు మరణం మధ్య పరివర్తన మానవ అవగాహనకు అతీతంగా ఉంటుంది. మిద్రాష్ ఎర్ర ఆవు యొక్క రహస్యాన్ని హైలైట్ చేస్తుంది, పునరుత్థానం మరియు దైవ సంకల్పం యొక్క లోతైన మరియు అస్పష్టమైన స్వభావాన్ని నొక్కి చెబుతుంది.

Search