Liquid error (sections/custom_mobile-menu line 86): Expected handle to be a String but got LinkListDrop
  • Group 27 Login

మరణం నుండి నిత్యత్వం వరకు: శుద్ధికరణకు ఎర్రని పెయ్య మార్గము

పరషత్ హుకత్ లో, ఎర్రని పెయ్య  బూడిద ద్వారా మరణం యొక్క అపవిత్రత నుండి శుద్ధి చెందే ప్రక్రియను మనం నేర్చుకుంటాము.

మరణం ఒక వ్యక్తిని అపవిత్రం చేస్తుందనే ఆలోచనే మానవాళికి అవమానం. మనుషులు అమరులు కాకపోవడం సిగ్గుచేటు. ఇది ఎక్కడ మొదలవుతుందో మనం అర్థం చేసుకుంటాము: ఇది మంచి చెడ్డల తెలివినిచ్చే  వృక్షం యొక్క పాపంతో ప్రారంభమవుతుంది మరియు దానిని సరిదిద్దాలి. మానవులపై మరణ యొక్క విజయ స్థానం శాశ్వతంగా ఉండదు. అందువలన, తోరా ఎర్ర పెయ్య యొక్క ప్రత్యేక నియమాల ద్వారా మరణం అనేది  చివరికి ప్రపంచం నుండి నిర్మూలించబడుతుందని మరియు మరణం యొక్క మలినాలు/అపవిత్రత మాయమవుతాయని సూచిస్తుంది. ఎలా?

ఇది చాలా సులభం. ఎర్రని పెయ్య యొక్క నియమాలు మరణం మరియు చనిపోయిన వారి పునరుత్థానం యొక్క మొత్తం ప్రక్రియను ప్రతీకాత్మకంగా పునర్నిర్మించే చర్యలను కలిగి ఉంటాయి. పురాతన కాలంలో మానవులతో సన్నిహితంగా ఉన్న అతిపెద్ద జంతువు ఆవు. ఎద్దు కంటే ఇది చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది ఎందుకంటే ఎద్దు బలంగా ఉన్నప్పటికీ, ఇది దాని లోపల పిండాన్ని మోయదు; ఆవు సంతానోత్పత్తికి ప్రాతినిధ్యం వహిస్తుంది. నిర్ధిష్టంగా ఎర్ర ఆవు ఎందుకు? ఎరుపు అనేది భౌతిక ప్రపంచం యొక్క రంగు. అదనంగా, ఆవు పరిపూర్ణంగా ఉండాలి, ఎటువంటి మచ్చలు లేకుండా ఉండాలి, ఎప్పుడూ కాడిని మోయకూడదు; ఇది సంపూర్ణమైనది.

అదనంగా, ఎరుపు ఆవు బూడిద ద్వారా శుద్దీకరణ ప్రక్రియకు అవసరమైన ఇతర వస్తువులుకూడా ఉన్నాయి: పురాతన కాలంలో మధ్యప్రాచ్యంలో అతిపెద్ద చెట్టు అయిన దేవదారు, జీవసంబంధమైన ప్రాణులన్నిటిలో అత్యల్ప రూపమైన ఒక పురుగు, మరియు హిస్సోప్, అతి చిన్న మొక్కగా పిలువబడుతుంది.

ఎర్ర ఆవు నుండి ఎర్రటి పురుగు వరకు మరియు సెడార్/దేవదారు వృక్షం నుండి హిస్సోపు వరకు జీవం యొక్క అన్ని హద్దులను తీసుకొని, అవి బూడిదగా మారే వరకు వాటిని కలిపి కాల్చమని తోరా మనకు ఆదేశిస్తుంది. బూడిద అనేది జీవం యొక్క అత్యల్ప రూపం; దానిని ముద్దగా తయారు చేయలేము మరియు దాని గరిష్ట శక్తి వద్ద మరణాన్ని సూచిస్తుంది.

ఈ బూడిదను, ఈ మరణమును జీవ జలంతో కలిపి ఒక పాత్రలో వేస్తారు. జీవ జలం మరియు పాత్ర అంటే ఏమిటి? అవి మనిషికి సాదృశ్యంగా వున్నాయి. మనిషి అనేవాడు జీవజాలములా, అనంతంగా ప్రవహిస్తాడు - ఇది మానవ ఆత్మ, మరియు పాత్ర అనగా  శరీరం. అందువలన ఎర్ర ఆవు నియమాల ప్రకారం శరీరాన్ని ఆత్మను, ఒక పాత్రగాను  జీవ జలంగాను తీసుకొని జంతువులు, మొక్కల నుంచి జీవ అవశేషమైన బూడిదతో కలుపుతాం. అప్పుడు, దీనితో, మరణం నుండి పునరుత్థానం సాధ్యమవుతుంది.

ఎర్ర ఆవు యొక్క మొత్తం ప్రక్రియ ప్రాణ నష్టానికి మరియు పునరుత్థానం ద్వారా దాని పునరుద్ధరణకు ప్రతీక అని చెప్పవచ్చు. ఇంత స్పష్టంగా ఉంటే ఎర్రని పెయ్య రహస్యాన్ని అర్థం చేసుకోలేమని మన యూదియ జ్ఞానులు మిద్రాష్ లో ఎందుకు చెప్పారు? నేను కేవలం ఒకటిన్నర నిమిషంలో మీకు దీన్ని వివరించాను. దీనికి జవాబు, జీవం నుండి మరణానికి మరియు మరణం నుండి జీవానికి పరివర్తన ఎలా చేయబడుతుందో ఒక వ్యక్తి అర్థం చేసుకోలేడు. ఇది ఎల్లప్పుడూ స్తుతిపాత్రుడైన సృష్టికర్త యొక్క రహస్యంగా ఉంటుంది.

More Weekly Portions

దైవిక మార్గదర్శకత్వం మరియు మానవ స్వరాలు: న్యాయ విధుల ఏర్పాటు

పరషత్ పీనెహాసు లో, సెలోపెహదు కుమార్తెలు యూదుల వారసత్వ చట్టాలలో ఒక కీలకమైన మార్పును ప్రేరేపించారు, ఇది కుమారులు లేనప్పుడు కుమార్తెలు వారసత్వంగా పొందడానికి అనుమతించే కొత్త ఆదేశాలకు దారితీసింది. ఈ కథనం దైవ మార్గదర్శకత్వం మరియు ప్రజల చొరవ మధ్య క్రియాశీలకమైన పరస్పర చర్యను వివరిస్తుంది. మొదట్లో అస్పష్టంగా ఉన్న మోషేకు, కుమార్తెలు ఆందోళన వ్యక్తం చేసిన తర్వాతే హాషెమ్ గారి నుండి నుంచి ఆదేశాలు అందాయి. ఈ కథ, ఇలాంటి వ్యాజ్యాలతో పాటు, మతపరమైన విచారణ మరియు ప్రతిస్పందన ద్వారా యూదుల చట్టం మరియు దైవ వెల్లడి యొక్క పరిణామంలో ప్రజల పాత్ర యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది.

ప్రశంస మరియు అసూయ : బాలాము ప్రవచనము లోని ద్వంద్వ స్వభావం

పరషత్ బాలక్‌లో, దేశాలలో ప్రసిద్ధి చెందిన ప్రవక్త అయిన బిలామ్ ఇశ్రాయేల్ పట్ల అభిమానం మరియు అసూయ యొక్క సంక్లిష్ట మిశ్రమాన్ని కలిగి ఉన్నాడు. ఇశ్రాయేల్ ను  శపించాలనే ఉద్దేశ్యంతో, అతను చివరికి వారిని ఆశీర్వదిస్తాడు, దైవిక ప్రేరణ మరియు ప్రవచనం యొక్క ప్రభావాన్ని వివరిస్తాడు. ఈ విరుద్ధమైన వైఖరి యూదు వ్యతిరేకత యొక్క విస్తృత థీమ్‌లను మరియు ఇష్టపడే పిల్లల మనోవిశ్లేషణ ప్రతిస్పందనను ప్రతిబింబిస్తుంది. తోరా విశ్వాసాన్ని నొక్కిచెబుతుంది, ఎందుకంటే ప్రార్థనా మందిరంలో మననం చేసే ప్రవచనం,యావత్ మానవాళిపై బలమైన దైవిక ప్రభావాన్ని సూచిస్తుంది, పవిత్రాత్మ పొందుకోవడానికి సర్వమానవాలికీ వున్న అవకాశాన్ని మిడ్రాష్ తన్నా దెబే ఎలియాహు యొక్క దృక్పథం ద్వారా నొక్కిచెబుతుంది.

మరణం నుండి నిత్యత్వం వరకు: శుద్ధికరణకు ఎర్రని పెయ్య మార్గము

పర్షత్ హుకత్ లో, ఎర్ర ఆవు (పారా అదుమా) ఆచారం మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షం యొక్క పాపంలో పాతుకుపోయిన మరణం యొక్క మలినాల నుండి శుద్ధిని సూచిస్తుంది. ఈ ఆచారంలో బూడిదను సజీవ నీటితో కలపడం, శరీరానికి మరియు ఆత్మకు ప్రాతినిధ్యం వహించడం, పునరుత్థానం ద్వారా జీవిత పునరుద్ధరణను వివరించడం జరుగుతుంది. ఈ ప్రక్రియ, దాని ప్రతీకాత్మక స్పష్టత ఉన్నప్పటికీ, ఒక దైవిక రహస్యాన్ని నొక్కిచెబుతుంది - జీవితం మరియు మరణం మధ్య పరివర్తన మానవ అవగాహనకు అతీతంగా ఉంటుంది. మిద్రాష్ ఎర్ర ఆవు యొక్క రహస్యాన్ని హైలైట్ చేస్తుంది, పునరుత్థానం మరియు దైవ సంకల్పం యొక్క లోతైన మరియు అస్పష్టమైన స్వభావాన్ని నొక్కి చెబుతుంది.

Search