Liquid error (sections/custom_mobile-menu line 86): Expected handle to be a String but got LinkListDrop
  • Group 27 Login

ప్రశంస మరియు అసూయ : బాలాము ప్రవచనము లోని ద్వంద్వ స్వభావం

తోరా గ్రంధం పరషత్ బాలక్ నందు, చరిత్ర అంతటిలో  అత్యంత గొప్ప ప్రవక్తలలో ఒకరిని గూర్చి చెప్పబడుతుంది. అతడే ప్రపంచ దేశాలనుండి వచ్చిన బెయోరు కుమారుడైన బాలాము. ఆయన ఎంత గొప్పవాడంటే, “మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇశ్రాయేలియులలో ఇదివరకు  పుట్టలేదు”(ద్వితీయ 34:10) అని చెప్పబడినప్పటికీ మన జ్ఞానులు గుర్తించిన ప్రకారం అన్యదేశాలలో అటువంటి ప్రవక్త పుట్టడం జరిగింది. అతడే బెయోరు కుమారుడైన బాలాము. అయితే, బాలాము తలరాత గోరమైనది. ఎందుకనగా అతడు ఇశ్రాయేలియులకు హాని చేయడానికి ప్రయత్నించాడు. 

మనము బాలాములో అసమాన్యమైన విషయమేదో గమనిస్తాము: ఇశ్రాయేలియులను శపించాలనే ఉద్దేశం ఉన్నప్పటికీ, అతడు చివరికి వారిని ఆశీర్వదిస్తాడు. అతడు ఇశ్రాయేలును ఎందుకు దీవించాడంటే, అతనిలో రెండు భిన్నమైన భావనలు ఉన్నాయి. ఒకవైపు అతడు ఇశ్రాయేలియులను కీర్తిస్తూనే మరొకప్రక్క ఈ మెచ్చుకోలు కారణంగా వారిపట్ల అసూయ పడ్డాడు. కాబట్టి అతనికి మరొక అవకాశంలేక వారిని శపించడానికి పూనుకున్నాడు. కానీ చివరికి దీవించాల్సివచ్చింది. 

యూదియ ప్రజలపట్ల ఇటువంటి సంక్లిష్టమైన ధోరణి ప్రపంచప్రజలందరిలోను చరిత్ర అంతటా మనం గమనించవచ్చు. “ మరియు సమస్త భూవంశములు నీవలన ఆశీర్వదింపబడును(ఆది 12:4) – ప్రకారం సమస్త జాతులలో నుండి ఇశ్రాయేలియులు ఎన్నుకోబడినది ఆ జాతుల ఆశీర్వాధముకొరకే అనే సత్యమును కొన్నిసార్లు ఆలోచితముగాను మరికొన్నిసార్లు అనాలోచితముగాను మానవాళి గుర్తించినది. కానీ చివరికి, ఈ జ్ఞానము కలిగివున్నప్పటికి శ్వవిరుద్దముగా ఒకరకమైన యాంటీ సెమిటిజంను రేపుతుంది. 

ఉదాహరణకు, ఒక కుటుంబములోనే, తల్లిదండ్రులు చేత చాలా గారాబం చేయబడిన కుమారుడే వారు చూపిన దయకు ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు. ప్రతి మానసిక విశ్లేషకునీకీ ఇది సుపరిచితమైన విషయమే. మనల్ని శపించడానికి పూనుకున్న బెయోరు కుమారుడైన బాలాముకు దీనిని కనెక్ట్ చేయవొచ్చు. 

సినగోగ్ లోకి ప్రవేశించేటప్పుడు, ప్రత్యేకించి బాలాము మాటలను మనం స్మరించుకుంటాము – “ యాకోబు నీ గుడారములు ఇశ్రాయేలూ నీ నివాసస్థలములు ఎంతో రమ్యమైనవి.” (సంఖ్య 24: 5) ప్రధానంగా, అన్యాజనాంగాల మధ్య ప్రవచన ఉనికి మరియు తోరాలో దాని ప్రస్తావన ఇశ్రాయేలు పై కురిపించబడిన దైవిక ప్రేరణ ప్రపంచ దేశాలను కూడా ప్రభావితం చేస్తుందనే ఆశను మానవాళికి అందిస్తుంది. 

మన ప్రాచీన మిద్రాషిమ్ లో ఒకటైన, తన్నా బెదే ఎలియాహూ నందు ఇలా చెప్పబడింది: ఆకాశమును భూమిని నాకు శాక్షులుగా కలిగియున్నాను (జాతిమత వ్యత్యాసము లేకుండా), స్త్రీ పురుషులకు (లింగ భేదం లేకుండా), పనివానికి పనికత్తెలకు (సామాజిక తారతమ్యత లేకుండా), ప్రతివారికీ  వారి క్రియలను అనుసరించి వారిపై దేవుని ఆత్మ క్రుమ్మరింపబడును అనే సత్యాన్ని వెల్లడిస్తున్నారు. 

క్లుప్తంగా, ఏలియాహూ గారు వెల్లడించినది యేమిటంటే, ఒక వ్యక్తిపై దేవుని ఆత్మ అనేది అతని క్రియల ఆధారంగానే అతనిపై క్రుమ్మరింపబడుతుంది తప్ప, అతనికిగాల గుర్తింపు లేదా పరిస్థితులను బట్టి కాదు. కావున, పరిశుద్దాత్మ మెండుగా ఇశ్రాయేలుపైన మరియు ప్రపంచము పైనా క్రుమ్మరింపబడాలని ఆశిద్దాం.

More Weekly Portions

దైవిక మార్గదర్శకత్వం మరియు మానవ స్వరాలు: న్యాయ విధుల ఏర్పాటు

పరషత్ పీనెహాసు లో, సెలోపెహదు కుమార్తెలు యూదుల వారసత్వ చట్టాలలో ఒక కీలకమైన మార్పును ప్రేరేపించారు, ఇది కుమారులు లేనప్పుడు కుమార్తెలు వారసత్వంగా పొందడానికి అనుమతించే కొత్త ఆదేశాలకు దారితీసింది. ఈ కథనం దైవ మార్గదర్శకత్వం మరియు ప్రజల చొరవ మధ్య క్రియాశీలకమైన పరస్పర చర్యను వివరిస్తుంది. మొదట్లో అస్పష్టంగా ఉన్న మోషేకు, కుమార్తెలు ఆందోళన వ్యక్తం చేసిన తర్వాతే హాషెమ్ గారి నుండి నుంచి ఆదేశాలు అందాయి. ఈ కథ, ఇలాంటి వ్యాజ్యాలతో పాటు, మతపరమైన విచారణ మరియు ప్రతిస్పందన ద్వారా యూదుల చట్టం మరియు దైవ వెల్లడి యొక్క పరిణామంలో ప్రజల పాత్ర యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది.

ప్రశంస మరియు అసూయ : బాలాము ప్రవచనము లోని ద్వంద్వ స్వభావం

పరషత్ బాలక్‌లో, దేశాలలో ప్రసిద్ధి చెందిన ప్రవక్త అయిన బిలామ్ ఇశ్రాయేల్ పట్ల అభిమానం మరియు అసూయ యొక్క సంక్లిష్ట మిశ్రమాన్ని కలిగి ఉన్నాడు. ఇశ్రాయేల్ ను  శపించాలనే ఉద్దేశ్యంతో, అతను చివరికి వారిని ఆశీర్వదిస్తాడు, దైవిక ప్రేరణ మరియు ప్రవచనం యొక్క ప్రభావాన్ని వివరిస్తాడు. ఈ విరుద్ధమైన వైఖరి యూదు వ్యతిరేకత యొక్క విస్తృత థీమ్‌లను మరియు ఇష్టపడే పిల్లల మనోవిశ్లేషణ ప్రతిస్పందనను ప్రతిబింబిస్తుంది. తోరా విశ్వాసాన్ని నొక్కిచెబుతుంది, ఎందుకంటే ప్రార్థనా మందిరంలో మననం చేసే ప్రవచనం,యావత్ మానవాళిపై బలమైన దైవిక ప్రభావాన్ని సూచిస్తుంది, పవిత్రాత్మ పొందుకోవడానికి సర్వమానవాలికీ వున్న అవకాశాన్ని మిడ్రాష్ తన్నా దెబే ఎలియాహు యొక్క దృక్పథం ద్వారా నొక్కిచెబుతుంది.

మరణం నుండి నిత్యత్వం వరకు: శుద్ధికరణకు ఎర్రని పెయ్య మార్గము

పర్షత్ హుకత్ లో, ఎర్ర ఆవు (పారా అదుమా) ఆచారం మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షం యొక్క పాపంలో పాతుకుపోయిన మరణం యొక్క మలినాల నుండి శుద్ధిని సూచిస్తుంది. ఈ ఆచారంలో బూడిదను సజీవ నీటితో కలపడం, శరీరానికి మరియు ఆత్మకు ప్రాతినిధ్యం వహించడం, పునరుత్థానం ద్వారా జీవిత పునరుద్ధరణను వివరించడం జరుగుతుంది. ఈ ప్రక్రియ, దాని ప్రతీకాత్మక స్పష్టత ఉన్నప్పటికీ, ఒక దైవిక రహస్యాన్ని నొక్కిచెబుతుంది - జీవితం మరియు మరణం మధ్య పరివర్తన మానవ అవగాహనకు అతీతంగా ఉంటుంది. మిద్రాష్ ఎర్ర ఆవు యొక్క రహస్యాన్ని హైలైట్ చేస్తుంది, పునరుత్థానం మరియు దైవ సంకల్పం యొక్క లోతైన మరియు అస్పష్టమైన స్వభావాన్ని నొక్కి చెబుతుంది.

Search