Search

Rosh-Hashana
రెండు ఆరంభాలను హత్తుకొనే శాశ్వత కాల జ్ఞానం రోష్ హషాన మరియు హెబ్రీ కాలండర్

మనం రోష్ హాషానాకు చేరువౌతున్నాం. హెబ్రీ కాలండర్ దీనితోనే ప్రారంభమౌతుంది. ఆశ్చర్యం యెంటంటే సంవత్సరం నడి మధ్యలో ఇది ప్రారంభమౌతుంది. తోరా ప్రకారం, తిష్రే అను ఏడవ  నెలలో రోష్ హాషాన్నా వస్తుంది.  అది ఏడవ నెల అయితే రోష్ హాషాన్న నిజంగానే సంవత్సరం మధ్యలో వస్తుంది కదా!? కాబట్టి దీనినుండి మనం అర్ధం చేసుకోవలసనిది యేమిటంటే, సంవత్సరం అనేది రెండు సార్లు ప్రారంభం కావచ్చు. అది వసంత ఋతువులో మొదటి నెలయైన నీసాను ప్రారంభంలోను, మరియు శరధ్ ఋతువులో తిష్రే అను ఏడవ నెల ప్రారంభంలోను రెండు సార్లు సంవత్సర ప్రరాంభమ్ జరుగుతుంది. ఈ రెండిటిలో ప్రతి ఆరంభము జాలానికి సంబంధించిన భిన్నమైన కాసెప్ట్స్ ను సూచిస్తుంది.

శరత్ ఋతువునే చూద్దాం. వాడిపోవుట క్షయమగుట అనేది ఈ సమయంలో జరుగుతుంది. ప్రపంచాన్ని ఒక నిరాశావాద దృక్పధంలో చూడడానికి ఈ సమయం కారణమౌతుంది. ప్రపంచానికి వయసు మళ్లినట్లుగానూ, కృషించిపోతున్నట్లుగాను అనిపిస్తుంది. మరోవైపు, వసంత ఋతువు ఆశలు చిగురింపచేసే సమయం. మరోసారి ప్రపంచం జీవం పొందుతున్నట్లు కనిపిస్తుంది. ప్రకృతి తనకు తాను మరోసారి నిర్మింపబడి జీవము నూతనముగా వికశిస్తుంది. దీనికి సమాంతరముగా ప్రపంచంలో రెండు విధానాలు వున్నట్లు మనం గమనించగలం. ఒకటి నిరంతర పునరుత్పత్తి కాగా, మరొకటి స్థిరంగా క్షయం కావడం. 

హెబ్రీ సంవత్సరము యేమి చేస్తుంది? క్షయమగు కాలానికి మరియు పునర్ ఉత్పత్తి జరుగు కాలానికి అనగా ఆ రెండిటికీ కూడా అర్ధాన్ని అందిస్తుంది. వాస్తవానికి సంవత్సరం అనేది ఎప్పటికీ అంతము కాదు.  అది వసంత రుతువులో నీసాను మాసంలో ప్రారంభమౌతుంది. అలాగే ఆరు నెలలు గడిచిన తరువాత రోష్ హషాన నాడు సంవత్సరం పునర్ ప్రారంభం జరుగుతుంది.

హెబ్రీ కేలండర్ నందు రెండు ప్రారాంభాలు ఉండడంవల్ల మనం ఎప్పుడూ సంవత్సర ప్రారంభంలో ఉంటాము తప్ప సంవత్సర అంతంలో వుండము. ఈ ప్రపంచంలో క్ష్యముజరిగే కాలము కూడా పునరుత్పత్తి జరిగించుటలో భాగము అన్నది మన విశ్వాశము. 

రోష్ హషాన దినమున మనము మరియు యావత్ ప్రపంచము నిలకడగా నూతనపరచబడతాము. చరిత్రపట్ల మనము ఆశా వాధ దృక్పధాము కలిగివుండాలనే విషయాన్ని గ్రహించే విధంగా మనం నడిపింపబడతాము. ఎందుకంటే, రాలుట క్షీణించుట, క్షయమగుట అనుప్రక్రియ, నిర్మింపబడి నూతన పరచబడుట అనే మరింత విస్తృతమైన ప్రక్రియలో ఒక భాగము.

ఇశ్రాయేల్ మరియు యావత్ ప్రపంచానికి ఆశీర్వాదకరమైన మంకీ సంవత్శరము అనుగ్రహింపబడు గాక!.

More Weekly Portions

దైవిక మార్గదర్శకత్వం మరియు మానవ స్వరాలు: న్యాయ విధుల ఏర్పాటు

పరషత్ పీనెహాసు లో, సెలోపెహదు కుమార్తెలు యూదుల వారసత్వ చట్టాలలో ఒక కీలకమైన మార్పును ప్రేరేపించారు, ఇది కుమారులు లేనప్పుడు కుమార్తెలు వారసత్వంగా పొందడానికి అనుమతించే కొత్త ఆదేశాలకు దారితీసింది. ఈ కథనం దైవ మార్గదర్శకత్వం మరియు ప్రజల చొరవ మధ్య క్రియాశీలకమైన పరస్పర చర్యను వివరిస్తుంది. మొదట్లో అస్పష్టంగా ఉన్న మోషేకు, కుమార్తెలు ఆందోళన వ్యక్తం చేసిన తర్వాతే హాషెమ్ గారి నుండి నుంచి ఆదేశాలు అందాయి. ఈ కథ, ఇలాంటి వ్యాజ్యాలతో పాటు, మతపరమైన విచారణ మరియు ప్రతిస్పందన ద్వారా యూదుల చట్టం మరియు దైవ వెల్లడి యొక్క పరిణామంలో ప్రజల పాత్ర యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది.

ప్రశంస మరియు అసూయ : బాలాము ప్రవచనము లోని ద్వంద్వ స్వభావం

పరషత్ బాలక్‌లో, దేశాలలో ప్రసిద్ధి చెందిన ప్రవక్త అయిన బిలామ్ ఇశ్రాయేల్ పట్ల అభిమానం మరియు అసూయ యొక్క సంక్లిష్ట మిశ్రమాన్ని కలిగి ఉన్నాడు. ఇశ్రాయేల్ ను  శపించాలనే ఉద్దేశ్యంతో, అతను చివరికి వారిని ఆశీర్వదిస్తాడు, దైవిక ప్రేరణ మరియు ప్రవచనం యొక్క ప్రభావాన్ని వివరిస్తాడు. ఈ విరుద్ధమైన వైఖరి యూదు వ్యతిరేకత యొక్క విస్తృత థీమ్‌లను మరియు ఇష్టపడే పిల్లల మనోవిశ్లేషణ ప్రతిస్పందనను ప్రతిబింబిస్తుంది. తోరా విశ్వాసాన్ని నొక్కిచెబుతుంది, ఎందుకంటే ప్రార్థనా మందిరంలో మననం చేసే ప్రవచనం,యావత్ మానవాళిపై బలమైన దైవిక ప్రభావాన్ని సూచిస్తుంది, పవిత్రాత్మ పొందుకోవడానికి సర్వమానవాలికీ వున్న అవకాశాన్ని మిడ్రాష్ తన్నా దెబే ఎలియాహు యొక్క దృక్పథం ద్వారా నొక్కిచెబుతుంది.

మరణం నుండి నిత్యత్వం వరకు: శుద్ధికరణకు ఎర్రని పెయ్య మార్గము

పర్షత్ హుకత్ లో, ఎర్ర ఆవు (పారా అదుమా) ఆచారం మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షం యొక్క పాపంలో పాతుకుపోయిన మరణం యొక్క మలినాల నుండి శుద్ధిని సూచిస్తుంది. ఈ ఆచారంలో బూడిదను సజీవ నీటితో కలపడం, శరీరానికి మరియు ఆత్మకు ప్రాతినిధ్యం వహించడం, పునరుత్థానం ద్వారా జీవిత పునరుద్ధరణను వివరించడం జరుగుతుంది. ఈ ప్రక్రియ, దాని ప్రతీకాత్మక స్పష్టత ఉన్నప్పటికీ, ఒక దైవిక రహస్యాన్ని నొక్కిచెబుతుంది - జీవితం మరియు మరణం మధ్య పరివర్తన మానవ అవగాహనకు అతీతంగా ఉంటుంది. మిద్రాష్ ఎర్ర ఆవు యొక్క రహస్యాన్ని హైలైట్ చేస్తుంది, పునరుత్థానం మరియు దైవ సంకల్పం యొక్క లోతైన మరియు అస్పష్టమైన స్వభావాన్ని నొక్కి చెబుతుంది.

Search