Search

Parashat DEVARIM
“పరషత్ దెవారిమ్ : విప్లవాత్మకంగా యూదత్వంలోని రాజనీతి మరియు మతము మధ్య గల సంబంధాన్ని తీర్చి దిద్దుట

పరషత్ దెవారిమ్

దెవారిమ్ (మాటలు) అను భాగముతో ప్రారంభమయ్యే,  ద్వితీయోపదేశకాండ గ్రంధము, ఎరెట్జ్ ఇశ్రాయేల్ (ఇశ్రాయేలు భూమి) కి సంబందించిన గ్రంధము.

ఇశ్రాయేలు భూమి వాస్తవానికి ఇశ్రాయేలు ప్రజల కొరకు ఉద్దేశింపబడినది. అయితే ఇశ్రాయేలు ప్రజలు ఆ భూమిలో యేమి చేస్తారో అది సర్వ మానవాళి అంతా అనుసరించుటకు ఒక మాదిరిగా ఉండడం కొరకు ఉద్దేశింపబడింది.  మొదటి నాలుగు గ్రంధాలలో,  తోరా అంతటా  సూచనలు, మిట్స్వోత్ మరియు చట్టాల జాబితాను  తెలియజేస్తుంది.  అయితే ఇదంతా దేనిని లక్ష్యంగా చేసుకుందో  మనకు అర్థమైందా?

 

దీనికి భిన్నంగా ద్వితీయోపదేశకాండ గ్రంధములో, ఉన్నట్టు ఉండి  మిట్స్వోత్ లన్నీ ,హెబ్రీ ప్రజల కొరకు వారి దేశములో, రాజనీతి/పరిపాలనకు సంబందించిన  రాజ్యాంగంగా కూర్చబడినట్లు చూస్తాం.  దీనినిబట్టి, తోరాకు రాజనీతి/పాలనాపరమైన విధానాల ఉద్దేశం ఉందని , ఇది యూదియ మతమునకు మాత్రమే ప్రత్యేకమైనదని వెల్లడి అవుతుంది.

మతాలెవీ   పరిపాలనా వ్యవహారాలతో నేరుగా సంబంధం కలిగి లేవు. మతము, రాజనీతి  రెండు వేర్వేరు  విషయాలుగాను  వాటిని దగ్గరచేర్చడం  విభిన్న జాతులను  కలపడంగాను పరిగణించబడుతుంది. మతం ఒక వ్యక్తి యోక్క విషయాలతో మాత్రమే వ్యవహరిస్తుందని, రాజ్యం /పాలక ప్రభుత్వం సమాజానికి సంబందించిన విషయాలతో  వ్యవహరిస్తుందని ప్రజలు అనుకుంటారు. క్రైస్తవ్యం ప్రపంచానికి నూరిపోసిన విధంగా  "సీజర్‌కి చెందినది సీజర్‌కు మరియు దేవునికి చెందినది దేవునికి ఇవ్వాలి." అనే సిద్దాంతాన్ని అంగీకరించి దానినే విశ్వసించే విధానానికి  ప్రపంచం ఇప్పటికే అలవాటు చేయబడింది. అయితే యూదత్వం ఈ ధోరణిని సమస్యాత్మకంగా పరిగణిస్తుంది.

 

ఇది సరియైన విధానము కాదని ద్వితీయోపదేశకాండములో, తోరా వెల్లడి చేస్తుంది. ఎదైతే చక్రవర్తికి చెందినదో అది  దేవునిదే! పరిశుద్దుడైన దేవుని పట్ల భయము కలిగి వుండుటయే సమాజము యొక్క సరియైన క్రమము.  దీని ప్రకారం, పైన పేర్కొన్న సిద్దాంతానికి చాలా విరుద్ధంగా బోధించాలి!

మానవాళిలోని విషయాల పురోగతికి ప్రధానమైన సాధనం రాజనీతి అనే భావన నుండి,  పాలనా వ్యవహారాలను చక్కబెట్టడానికి కట్టుబడి వుండాలి అను నియమం ఉధ్బవించింది. అందుచేత రాజనీతిలో/ పరిపాలనా వ్యవహారాలలో కూడా పరిశుద్దతను  కాపాడాలి అను విషయాన్ని ద్వితీయోపదేశకాండము తెలియజేస్తుంది.

ఇశ్రాయేలు ప్రజలు తమ దేశంలో చేసే విషయాలు ఇతర దేశాలు అనుసరించడానికి ఒక నమూనాగా నిర్దేశింపబడ్డాయని  ఇప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు. ప్రతి దేశము, ఆయా దేశాలకు తగినరీతిలో,  ఇశ్రాయేలు ప్రజల విధానాల  నుండి సమాజ మార్గదర్శకాల నమూనాను స్వీకరించాలి. ఈ కారణంచేతే ఏడు నోవహీయ  ఆజ్ఞలలో ఒకటిగా ధర్మబద్దమైన న్యాయ వ్యవస్థను ఏర్పాటు చేయవలసిన బాధ్యత ఇవ్వబడింది. దీనర్థం ప్రతి దేశము  సముచితమైన సామాజిక వ్యవస్థను  ఏర్పాటు చేయాలి, అది కేవలం ఆధ్యాత్మికతకు మాత్రమే కాకుండా న్యాయమైన మరియు ధర్మబద్ధమైన సామాజిక ప్రవర్తనకు మార్గదర్శకంగా ఉండాలి.  ప్రజలందరికి న్యాయమును నిజాయితీని చేకూర్చేదానికి  సమాజము కట్టుబడి ఉండాలన్నదే మతపరమైన ప్రాధమిక సూత్రము అని ద్వితీయోపదేశకాండము భోదిస్తుంది.

More Weekly Portions

దైవిక మార్గదర్శకత్వం మరియు మానవ స్వరాలు: న్యాయ విధుల ఏర్పాటు

పరషత్ పీనెహాసు లో, సెలోపెహదు కుమార్తెలు యూదుల వారసత్వ చట్టాలలో ఒక కీలకమైన మార్పును ప్రేరేపించారు, ఇది కుమారులు లేనప్పుడు కుమార్తెలు వారసత్వంగా పొందడానికి అనుమతించే కొత్త ఆదేశాలకు దారితీసింది. ఈ కథనం దైవ మార్గదర్శకత్వం మరియు ప్రజల చొరవ మధ్య క్రియాశీలకమైన పరస్పర చర్యను వివరిస్తుంది. మొదట్లో అస్పష్టంగా ఉన్న మోషేకు, కుమార్తెలు ఆందోళన వ్యక్తం చేసిన తర్వాతే హాషెమ్ గారి నుండి నుంచి ఆదేశాలు అందాయి. ఈ కథ, ఇలాంటి వ్యాజ్యాలతో పాటు, మతపరమైన విచారణ మరియు ప్రతిస్పందన ద్వారా యూదుల చట్టం మరియు దైవ వెల్లడి యొక్క పరిణామంలో ప్రజల పాత్ర యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది.

ప్రశంస మరియు అసూయ : బాలాము ప్రవచనము లోని ద్వంద్వ స్వభావం

పరషత్ బాలక్‌లో, దేశాలలో ప్రసిద్ధి చెందిన ప్రవక్త అయిన బిలామ్ ఇశ్రాయేల్ పట్ల అభిమానం మరియు అసూయ యొక్క సంక్లిష్ట మిశ్రమాన్ని కలిగి ఉన్నాడు. ఇశ్రాయేల్ ను  శపించాలనే ఉద్దేశ్యంతో, అతను చివరికి వారిని ఆశీర్వదిస్తాడు, దైవిక ప్రేరణ మరియు ప్రవచనం యొక్క ప్రభావాన్ని వివరిస్తాడు. ఈ విరుద్ధమైన వైఖరి యూదు వ్యతిరేకత యొక్క విస్తృత థీమ్‌లను మరియు ఇష్టపడే పిల్లల మనోవిశ్లేషణ ప్రతిస్పందనను ప్రతిబింబిస్తుంది. తోరా విశ్వాసాన్ని నొక్కిచెబుతుంది, ఎందుకంటే ప్రార్థనా మందిరంలో మననం చేసే ప్రవచనం,యావత్ మానవాళిపై బలమైన దైవిక ప్రభావాన్ని సూచిస్తుంది, పవిత్రాత్మ పొందుకోవడానికి సర్వమానవాలికీ వున్న అవకాశాన్ని మిడ్రాష్ తన్నా దెబే ఎలియాహు యొక్క దృక్పథం ద్వారా నొక్కిచెబుతుంది.

మరణం నుండి నిత్యత్వం వరకు: శుద్ధికరణకు ఎర్రని పెయ్య మార్గము

పర్షత్ హుకత్ లో, ఎర్ర ఆవు (పారా అదుమా) ఆచారం మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షం యొక్క పాపంలో పాతుకుపోయిన మరణం యొక్క మలినాల నుండి శుద్ధిని సూచిస్తుంది. ఈ ఆచారంలో బూడిదను సజీవ నీటితో కలపడం, శరీరానికి మరియు ఆత్మకు ప్రాతినిధ్యం వహించడం, పునరుత్థానం ద్వారా జీవిత పునరుద్ధరణను వివరించడం జరుగుతుంది. ఈ ప్రక్రియ, దాని ప్రతీకాత్మక స్పష్టత ఉన్నప్పటికీ, ఒక దైవిక రహస్యాన్ని నొక్కిచెబుతుంది - జీవితం మరియు మరణం మధ్య పరివర్తన మానవ అవగాహనకు అతీతంగా ఉంటుంది. మిద్రాష్ ఎర్ర ఆవు యొక్క రహస్యాన్ని హైలైట్ చేస్తుంది, పునరుత్థానం మరియు దైవ సంకల్పం యొక్క లోతైన మరియు అస్పష్టమైన స్వభావాన్ని నొక్కి చెబుతుంది.

Search