Search
      Liquid error (sections/custom_mobile-menu line 86): Expected handle to be a String but got LinkListDrop
  • Group 27 Login

Parshat Nitzavim:
లెక్కకు మించి జీవమును ఎంచుకొనుట: జీవము మరణము మరియు దేవునితో సంబంధంపై తోరా యొక్క ఆధ్యాత్మిక దృక్పధం

నిట్సావీమ్ – వయెలెహ్ అను రెండు తోరా భాగాలకు సరిగ్గా మధ్యభాగంలో అతిముఖ్యమైన తోరా సందేశం ఉంది.

తోరా ఇలా చెబుతుంది- “జీవమును మరణమును నీఎదుట ఉంచియున్నాను, కాగా జీవమును కోరుకొనుము”. ఈ వచనమును మొదటిసారి చూసినప్పుడు చాలా సాధారణముగా కనిపిస్తుంది. అయితే ఈ వచనము ఏమి చెబుతుందంటే, మనం జీవము, మరణము అను రెండు విషయాలలో ఒకటి ఎంచుకోవాల్సి వస్తే జీవాన్నే ఎంచుకోవాలని తెలియజేస్తుంది. సహజంగా ఎవరైనా జీవాన్నే కోరుకుంటారు కానీ మరణాన్ని కాదు. అయితే తోరా ఇక్కడ ఏదో ఒక ముఖ్యమైన విషయం గూర్చి హింట్ ఇస్తుంది. ఒక మనిషి యొక్క వాస్తవమైన తత్వం ప్రకారం అతను మరణాన్ని ఉంచుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా అనేకమంది ఆధ్యాత్మికవేత్తలు, ఆత్మకు సంబంధించిన విషయాలకు ప్రాధాన్యత నిచ్చేవారంతా, ఈ ప్రపంచాన్ని వదిలిపెట్టి దేవునితో మమేకం కావడం ఉన్నతమైన విషయం అని సూచిస్తారు. పరిపూర్ణమైన ఆధ్యాత్మికమైన స్థితిలోనికి మారడానికి మరణం అనేది మోక్షమార్గమనే ఒక విధమైన అనారోగ్యకరమైన ధోరణి మరణం పట్ల వ్యక్తమౌతుంది. మరికొంతమంది తమ భౌతిక దేహాలనుకూడా విడిచిపెట్టడానికి సిద్దమౌతారు – స్పిరిట్యువల్ డెత్. 

అయితే తోరా మనకు దీనికి చాలా భిన్నమైన విషయాన్ని బోధిస్తుంది. “నేను నీ ఎదుట జీవమును, మరణమును వుంచియున్నాను.” అని చెబుతుంది. చావుని ఎంచుకోమని అది ఉన్నతమైన విషయమనే సిద్దాంతాలు ఉండగా, జీవముద్వారా దేవునిని చేరుకోవాలి అనే ఒక నూతనమైన విషయాన్ని తోరా ఆవిష్కరిస్తుంది. “నీవు జీవమును కోరుకొనుము”. ఎందుకు? ఎందుకంటే ఈ ఛాయిస్ ద్వారా మనము జీవిస్తాము, మన సంతతి కూడా భూమిపై జీవించివుంటారు. నిజముగా ఈ ప్రపంచములో జీవించడం ద్వారా సృష్టికర్తను చేరుకోవచ్చు అనేదే దీని అర్ధము.

ఈ మాటలలోని మరొక ప్రాధమికమైన ఉద్దేశం ఎదనగా, ఒక వ్యక్తి తనకు ఉన్న స్వేచ్చతో ఎంచుకోవచ్చు. నువ్వు మంచి చెడుల మధ్య మరియు జీవము మరణముల మధ్య ఒకదానిని ఎంచుకోవచ్చు. నువ్వు ఎంచుకున్న మార్గాన్ని నిర్ణయించేది నీవే తప్ప మరే ఇతర భాయ శక్తి కాదు. ఇలా ఎంపిక చేసుకునే స్వేచ్చ అనేది బాధ్యతను ఇస్తుంది. నేను ఒక విషయాన్ని ఎంచుకున్నప్పుడు దానికి సంబంధించిన విషయాలను నేను గాలిబిలి చేయొచ్చు లేదా ఒక క్రమపద్దతిలో నైనా నిర్మించవచ్చు. ఒక వ్యక్తి స్వేచ్చతో జీవాన్ని ఎంచుకోవడం ద్వారా జీవితానికి ఒక అర్ధం లబిస్తుంది. మన జీవితానికి నైతిక ప్రాధాన్యత సంతరించుకుంటుంది.

లఘు సారాంశము (35 పధాలలో)

నిట్సావీమ్ – వయెలెహ్ భాగంలో తోరా జీవమును మరణమును మనముందు ఉంచుతుంది. సరిగ్గా ఎంచుకోవలసినది జీవము కాగా, కొంచం లోతుగా ధ్యానించినప్పుడు మరణము అనే విషయంపై కొన్ని ఆధ్యాత్మిక ఉద్దేశాలు బయటపడతాయి. దేవుని చేరుకోవడానికి మరియు నైతిక ప్రాధ్యాన్యతను హత్తుకోయడానికి , జీవమును ఎంచుకోమని తోరా ప్రోత్సహిస్తుంది.

సారాంశం విఫులంగా (80 పధాలలో)

రెండు భాగాలతో కూడిన నిత్సవీమ్ – వయెలెహ్ పరాష జీవము మరణము అను రెండు విషయాలో కీలకంగా ఒకదానిని ఎంచుకోవడాన్ని మనముందు ఉంచుతుంది. మనం సహజంగా జీవాన్నే ఎంచుకోవడానికి మొగ్గు చూపుతాం. అయితే, తోరా ఇక్కడ ఆధ్యాత్మిక కోణాలను అందిస్తుంది. మరణాన్ని ఎంచుకొనే విధానం ద్వారా దేవునితో మమేకం కావడాన్ని తోరా గుర్తించినప్పటికీ, దానికి భిన్నమైన మార్గాన్ని ప్రభోదిస్తుంది. జీవమును ఎంచుకోవడం ద్వారా ఒకడు కేవలం బ్రతకడం వరకే కాదు గాని దాని ద్వారా దేవుని చెరగలుగుతాడు. ఈ ఛాయిస్ లో స్వేచ్చ మరియు భాద్యత రెండూ ఇమిడివున్నాయి. జీవిత ప్రయాణంలో నైతికతను ప్రవేశపెట్టాలని నిర్వచిస్తుంది.

More Weekly Portions

దైవిక మార్గదర్శకత్వం మరియు మానవ స్వరాలు: న్యాయ విధుల ఏర్పాటు

పరషత్ పీనెహాసు లో, సెలోపెహదు కుమార్తెలు యూదుల వారసత్వ చట్టాలలో ఒక కీలకమైన మార్పును ప్రేరేపించారు, ఇది కుమారులు లేనప్పుడు కుమార్తెలు వారసత్వంగా పొందడానికి అనుమతించే కొత్త ఆదేశాలకు దారితీసింది. ఈ కథనం దైవ మార్గదర్శకత్వం మరియు ప్రజల చొరవ మధ్య క్రియాశీలకమైన పరస్పర చర్యను వివరిస్తుంది. మొదట్లో అస్పష్టంగా ఉన్న మోషేకు, కుమార్తెలు ఆందోళన వ్యక్తం చేసిన తర్వాతే హాషెమ్ గారి నుండి నుంచి ఆదేశాలు అందాయి. ఈ కథ, ఇలాంటి వ్యాజ్యాలతో పాటు, మతపరమైన విచారణ మరియు ప్రతిస్పందన ద్వారా యూదుల చట్టం మరియు దైవ వెల్లడి యొక్క పరిణామంలో ప్రజల పాత్ర యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది.

ప్రశంస మరియు అసూయ : బాలాము ప్రవచనము లోని ద్వంద్వ స్వభావం

పరషత్ బాలక్‌లో, దేశాలలో ప్రసిద్ధి చెందిన ప్రవక్త అయిన బిలామ్ ఇశ్రాయేల్ పట్ల అభిమానం మరియు అసూయ యొక్క సంక్లిష్ట మిశ్రమాన్ని కలిగి ఉన్నాడు. ఇశ్రాయేల్ ను  శపించాలనే ఉద్దేశ్యంతో, అతను చివరికి వారిని ఆశీర్వదిస్తాడు, దైవిక ప్రేరణ మరియు ప్రవచనం యొక్క ప్రభావాన్ని వివరిస్తాడు. ఈ విరుద్ధమైన వైఖరి యూదు వ్యతిరేకత యొక్క విస్తృత థీమ్‌లను మరియు ఇష్టపడే పిల్లల మనోవిశ్లేషణ ప్రతిస్పందనను ప్రతిబింబిస్తుంది. తోరా విశ్వాసాన్ని నొక్కిచెబుతుంది, ఎందుకంటే ప్రార్థనా మందిరంలో మననం చేసే ప్రవచనం,యావత్ మానవాళిపై బలమైన దైవిక ప్రభావాన్ని సూచిస్తుంది, పవిత్రాత్మ పొందుకోవడానికి సర్వమానవాలికీ వున్న అవకాశాన్ని మిడ్రాష్ తన్నా దెబే ఎలియాహు యొక్క దృక్పథం ద్వారా నొక్కిచెబుతుంది.

మరణం నుండి నిత్యత్వం వరకు: శుద్ధికరణకు ఎర్రని పెయ్య మార్గము

పర్షత్ హుకత్ లో, ఎర్ర ఆవు (పారా అదుమా) ఆచారం మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షం యొక్క పాపంలో పాతుకుపోయిన మరణం యొక్క మలినాల నుండి శుద్ధిని సూచిస్తుంది. ఈ ఆచారంలో బూడిదను సజీవ నీటితో కలపడం, శరీరానికి మరియు ఆత్మకు ప్రాతినిధ్యం వహించడం, పునరుత్థానం ద్వారా జీవిత పునరుద్ధరణను వివరించడం జరుగుతుంది. ఈ ప్రక్రియ, దాని ప్రతీకాత్మక స్పష్టత ఉన్నప్పటికీ, ఒక దైవిక రహస్యాన్ని నొక్కిచెబుతుంది - జీవితం మరియు మరణం మధ్య పరివర్తన మానవ అవగాహనకు అతీతంగా ఉంటుంది. మిద్రాష్ ఎర్ర ఆవు యొక్క రహస్యాన్ని హైలైట్ చేస్తుంది, పునరుత్థానం మరియు దైవ సంకల్పం యొక్క లోతైన మరియు అస్పష్టమైన స్వభావాన్ని నొక్కి చెబుతుంది.

Search