Liquid error (sections/custom_mobile-menu line 86): Expected handle to be a String but got LinkListDrop
  • Group 27 Login

Parshat Ki Tavo:
ప్రధమ సంతానపు మిట్స్వాలో లోతుగా ప్రతిధ్వనిస్తున్న కయీన్ హెబెల్ ల పరంపర – వెల్లడైన బంధం

ప్రధమ సంతానపు మిట్స్వాలో  లోతుగా ప్రతిధ్వనిస్తున్న   కయీన్  హెబెల్ ల పరంపర – వెల్లడైన బంధం 

పరషత్ ‘కి - తావో’ (ద్వితీయోపదేశకాండము 26) లోని  మొదటి  మిట్స్వా, ప్రధమ సంతానపు మిట్స్వా. కయీన్ మరియు హెబెల్ ల సంక్లిష్ట సంబంధానికి ఈ మిట్స్వా కొనసాగింపుగా వుంది.

ప్రధమ సంతానమైన కయీన్ మరియు ద్వితీయ సంతానమైన హెబెల్ యొక్క ప్రాధాన్యతను ఆదికాండము 4వ అధ్యాయములో తోరా మనకు ముందే తెలియజేసింది.   ఈ వ్యత్యాసము, అనగా వారిరువురికి  ఉన్న వ్యతిరేక ధోరణులు, వారు ఇతరులతో వ్యవహరించు విధానమును ప్రభావితం చేసింది. ప్రధమ సంతానముగా కయీన్ తనకు కొన్ని ప్రత్యేకమైన హక్కులు వున్నట్లు గ్రహించి, ఇతరులను పక్కనపెట్టి తనకుతాను ప్రధానునిగా ఎంచుకున్నాడు. తత్ఫలితంగా మిగిలిన ధాన్యం నుండి అర్పణ తీసుకువచ్చాడు. మరోప్రక్క ద్వితీయ కుమారునిగా తన స్థానమును గుర్తెరిగిన హెబెల్, ఇతరులతో భాగం పంచుకొవడమే తాను చేయవలసిన కార్యమని  గ్రహించాడు.

ఈ దృక్పధమును బట్టి, ఏ దినమైతే ప్రధమ సంతానము (బిక్కురీమ్) జన్మించిందో అదే రోజున దేవుడు తోరాను ఎందుకు  అనుగ్రహించాడో (షావువోత్ పండుగ) స్పష్టమౌతుంది. అనగా ప్రధమ సంతానమును అర్పణాగా ఇవ్వగలిగే వారికే తోరా అనుగ్రహింపబడుతుందని తెలుస్తుంది. తమది ద్వితీయ స్థానమని గ్రహించి ఇతరులతో  పాలుపంచుకోవలసిన  భాద్యతను గుర్తెరిగిన వారికి అది ప్రసాదించబడుతుంది. ఈ విధానమును అనుసరించి, సూచనప్రాయంగా పరిశుద్దుడైన దేవుడు ప్రధమ ఫలమైన తోరాను తీసుకొని హెబ్రీ జాతి ద్వారా సర్వమానవాళికి బహూకరించాడు.     

ప్రధమఫలమును యాజకుని మందిరమునకు తీసుకొని రావాలని తోరా మనకు సూచిస్తున్నప్పుడు దానికి మరింత లోతైన ప్రాధాన్యత ఉంటుంది. ఇశ్రాయేలియులలో ప్రతిద్వనించే చారిత్రక ఘట్టమైన ఐగుప్తు నిర్గమ కధను ఈ చర్య తెలియజేస్తుంది.

ఒక వ్యక్తి ప్రధమ ఫలమును అర్పించునప్పుడు యాజకునితో ఈ విధముగా చెప్పవలసి వుంటుంది, “నేను ఈ దేశమునకు వచియున్నాను, అని నీ దేవుడైన అదొనాయ్ ఎదుట ఈ దినమున ప్రకటన చేయుచున్నాను.” చూడడానికి ఈ ప్రకటన అస్పష్టంగా ఉన్నట్లుంది. ఒక వ్యక్తి తరతరాలుగా ఇశ్రాయేలు దేశములోనే నివశిస్తూ వున్నప్పటికీ వారి రాక ఇప్పుడే సంభవించినట్లు దానిని ప్రకటన చేయవలెనని వారికి ఆజ్ఞాపించబడింది. వింతగా అనిపించే ఈ ఆజ్ఞ మానసికమైన ఒక పాఠాన్ని నేర్పుతుంది. ఒకడు తన దేశములో నూతనముగా ప్రవేశించినట్లు, ఒక క్రొత్త ప్రపంచంలో అడుగుపెడుతున్నట్లు ఎల్లపుడూ భావించాలి.

ఒకరు ఎల్లప్పుడు తమ మూలాలగురించి నిరంతరం అవగాహన కలిగి ఉండి, నిరంతరం పునరుత్తేజం అవ్వాల్సిన అవసరాన్ని గుర్తించి, వారి మార్గాన్ని ముందుకు నడిపిస్తుంది.

More Weekly Portions

దైవిక మార్గదర్శకత్వం మరియు మానవ స్వరాలు: న్యాయ విధుల ఏర్పాటు

పరషత్ పీనెహాసు లో, సెలోపెహదు కుమార్తెలు యూదుల వారసత్వ చట్టాలలో ఒక కీలకమైన మార్పును ప్రేరేపించారు, ఇది కుమారులు లేనప్పుడు కుమార్తెలు వారసత్వంగా పొందడానికి అనుమతించే కొత్త ఆదేశాలకు దారితీసింది. ఈ కథనం దైవ మార్గదర్శకత్వం మరియు ప్రజల చొరవ మధ్య క్రియాశీలకమైన పరస్పర చర్యను వివరిస్తుంది. మొదట్లో అస్పష్టంగా ఉన్న మోషేకు, కుమార్తెలు ఆందోళన వ్యక్తం చేసిన తర్వాతే హాషెమ్ గారి నుండి నుంచి ఆదేశాలు అందాయి. ఈ కథ, ఇలాంటి వ్యాజ్యాలతో పాటు, మతపరమైన విచారణ మరియు ప్రతిస్పందన ద్వారా యూదుల చట్టం మరియు దైవ వెల్లడి యొక్క పరిణామంలో ప్రజల పాత్ర యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది.

ప్రశంస మరియు అసూయ : బాలాము ప్రవచనము లోని ద్వంద్వ స్వభావం

పరషత్ బాలక్‌లో, దేశాలలో ప్రసిద్ధి చెందిన ప్రవక్త అయిన బిలామ్ ఇశ్రాయేల్ పట్ల అభిమానం మరియు అసూయ యొక్క సంక్లిష్ట మిశ్రమాన్ని కలిగి ఉన్నాడు. ఇశ్రాయేల్ ను  శపించాలనే ఉద్దేశ్యంతో, అతను చివరికి వారిని ఆశీర్వదిస్తాడు, దైవిక ప్రేరణ మరియు ప్రవచనం యొక్క ప్రభావాన్ని వివరిస్తాడు. ఈ విరుద్ధమైన వైఖరి యూదు వ్యతిరేకత యొక్క విస్తృత థీమ్‌లను మరియు ఇష్టపడే పిల్లల మనోవిశ్లేషణ ప్రతిస్పందనను ప్రతిబింబిస్తుంది. తోరా విశ్వాసాన్ని నొక్కిచెబుతుంది, ఎందుకంటే ప్రార్థనా మందిరంలో మననం చేసే ప్రవచనం,యావత్ మానవాళిపై బలమైన దైవిక ప్రభావాన్ని సూచిస్తుంది, పవిత్రాత్మ పొందుకోవడానికి సర్వమానవాలికీ వున్న అవకాశాన్ని మిడ్రాష్ తన్నా దెబే ఎలియాహు యొక్క దృక్పథం ద్వారా నొక్కిచెబుతుంది.

మరణం నుండి నిత్యత్వం వరకు: శుద్ధికరణకు ఎర్రని పెయ్య మార్గము

పర్షత్ హుకత్ లో, ఎర్ర ఆవు (పారా అదుమా) ఆచారం మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షం యొక్క పాపంలో పాతుకుపోయిన మరణం యొక్క మలినాల నుండి శుద్ధిని సూచిస్తుంది. ఈ ఆచారంలో బూడిదను సజీవ నీటితో కలపడం, శరీరానికి మరియు ఆత్మకు ప్రాతినిధ్యం వహించడం, పునరుత్థానం ద్వారా జీవిత పునరుద్ధరణను వివరించడం జరుగుతుంది. ఈ ప్రక్రియ, దాని ప్రతీకాత్మక స్పష్టత ఉన్నప్పటికీ, ఒక దైవిక రహస్యాన్ని నొక్కిచెబుతుంది - జీవితం మరియు మరణం మధ్య పరివర్తన మానవ అవగాహనకు అతీతంగా ఉంటుంది. మిద్రాష్ ఎర్ర ఆవు యొక్క రహస్యాన్ని హైలైట్ చేస్తుంది, పునరుత్థానం మరియు దైవ సంకల్పం యొక్క లోతైన మరియు అస్పష్టమైన స్వభావాన్ని నొక్కి చెబుతుంది.

Search