Search
      Liquid error (sections/custom_mobile-menu line 86): Expected handle to be a String but got LinkListDrop
  • Group 27 Login

నిశ్శబ్దానికి అతీతంగా: నిర్గమా కాండము లో పేర్లు, గుర్తింపు మరియు సంఘీభావపు ఆవిష్కరణ

నిర్గమ కాండము 2: 1-5

“లేవి వంశస్థుడొకడు వెళ్లి లేవి కుమార్తెను వివాహము చేసికొనెను. ఆ స్త్రీ గర్భవతియై కుమారుని కని,వాడు సుందరుడైయుండుట చూచి మూడునెలలు వానిని దాచెను.”

“వానికేమి సంభవించునో తెలిసికొనుటకు వాని అక్క దూరముగా నిలిచియుండెను. ఫరో కుమార్తె స్నానము చేయుటకు ఏటికి వచ్చెను.” 

ఈవచనాలన్నింటిలో లేదా మనం తీసుకున్న ఈ వచన భాగాలన్నిటిలో ఒక దాని ఆవశ్యకత ఉంది, అదే - పేర్లు. ఆ పురుషుడు ఎవరు, స్త్రీ ఎవరు, బిడ్డ ఎవరు, ఫరో కుమార్తె ఎవరు, సోదరి ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నాం. ఇతర మూలాల నుండి మనకు తెలుసు, కాని ఈ వాఖ్య భాగాలలో  ఉద్దేశపూర్వకంగా ఇక్కడ పాత్రల పేర్ల తొలగించబడ్డాయి. ఇగుప్తు నేపధ్యంలో పేర్ల తొలగింపును తెలియజేయడానికి ఇది ఉద్దేశించబడింది. (ఐగుప్తులోనికి యాకోబుతో వచ్చిన) ఇశ్రాయేలీయుల పేరులు ఏవనగా,' అనే పదాలతో మన భాగం మొదలవుతుండగా, కథనంలో పురోగమిస్తున్న కొద్దీ పేర్లు క్రమంగా మాయమవుతాయి. 

ఇగుప్తు  అనేది వ్యక్తి యొక్క వ్యక్తిగత విలువను గుర్తించక, వ్యక్తులను అమానవీయంగా గుర్తిస్తుంది.   "ఆమె అతనికి మోషే అని పేరు పెట్టెను" అని అది మోషేను గూర్చి మాత్రమే వ్రాయబడి ఉంది.  మోషే అంటే అర్ధం ఏంటి? మోషే అనేది “అబ్బాయి” అని అర్ధమిచ్చే  ఈజిప్టు పదం. "నేను అతన్ని నీటి నుండి తీసుకున్నాను, అని ఆమె చెప్పెను". ఇది  ఒక ఐగుప్తు  నామానికి హీబ్రూ భాష్యం, అంటే మోషే మిద్యను కు పారిపోయి సిప్పోరాను వివాహం చేసుకున్న తరువాత మాత్రమే - ఆహ్, అకస్మాత్తుగా పేర్లు వచ్చాయి, మోషే, యిత్రో, రగూయేలు, సిపోరా మరియు వారి కుమారుడు గెర్షోము పేర్లు కూడా ఉన్నాయి, మరియు ఆయన మోషేతో చెప్పినప్పుడు పరిశుద్ధుని పేరు కూడా బహిర్గతమవుతుంది.  'నా పేరు తెలుసుకోవాలని ఉందా? ఇదిగో నా పేరు'. 

'కనుమరుగైన పరిభాషలో - తుడిచిపెట్టుకుపోయిన ఒక సంస్కృతి లోతుల్లో మన పితరులు ఈజిప్టులో 'మిళితమయ్యారని’ మనం అర్థం చేసుకున్నాం -. కాబట్టి, మోషే తాను ఏ సంస్కృతికి చెందినవాడినో నిర్ణయించుకోవలసి వచ్చింది. 'మోషే తన సహోదరుల దగ్గరకు వెళ్ళాడు' అని వ్రాయబడినప్పుడు, వారు ఎవరు అని మనం అడగాలి. రబ్బీ అబ్రహాం ఇబ్న్ ఎజ్రా ఇది ఈజిప్షియన్లను సూచిస్తుందని నమ్ముతుండగా, రంబాన్ ఇది హెబ్రీయులను సూచిస్తుందని చెబుతున్నారు. మోషే తనకు తాను స్పష్టత తెచ్చుకోవలసి వచ్చి౦ది, కాబట్టి ఆయన పరిశీలన చేయడానికి వెళ్ళాడు. ఒక ఇగుప్తీయుడుహెబ్రీయుని కొట్టడం చూసినప్పుడు, హీబ్రూ ప్రజలు తన సహోదరులని అతను అర్థం చేసుకున్నాడు మరియు భావించాడు. మోషే సంఘీభావం ఆయనను ఈ సాక్షాత్కారానికి తీసుకువచ్చింది, హీబ్రూ ప్రజల భవితవ్యంతో అతన్ని ముడిపెట్టింది, ఎందుకంటే అతను వారి బాధలతో సహానుభూతి చెందాడు."

More Weekly Portions

దైవిక మార్గదర్శకత్వం మరియు మానవ స్వరాలు: న్యాయ విధుల ఏర్పాటు

పరషత్ పీనెహాసు లో, సెలోపెహదు కుమార్తెలు యూదుల వారసత్వ చట్టాలలో ఒక కీలకమైన మార్పును ప్రేరేపించారు, ఇది కుమారులు లేనప్పుడు కుమార్తెలు వారసత్వంగా పొందడానికి అనుమతించే కొత్త ఆదేశాలకు దారితీసింది. ఈ కథనం దైవ మార్గదర్శకత్వం మరియు ప్రజల చొరవ మధ్య క్రియాశీలకమైన పరస్పర చర్యను వివరిస్తుంది. మొదట్లో అస్పష్టంగా ఉన్న మోషేకు, కుమార్తెలు ఆందోళన వ్యక్తం చేసిన తర్వాతే హాషెమ్ గారి నుండి నుంచి ఆదేశాలు అందాయి. ఈ కథ, ఇలాంటి వ్యాజ్యాలతో పాటు, మతపరమైన విచారణ మరియు ప్రతిస్పందన ద్వారా యూదుల చట్టం మరియు దైవ వెల్లడి యొక్క పరిణామంలో ప్రజల పాత్ర యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది.

ప్రశంస మరియు అసూయ : బాలాము ప్రవచనము లోని ద్వంద్వ స్వభావం

పరషత్ బాలక్‌లో, దేశాలలో ప్రసిద్ధి చెందిన ప్రవక్త అయిన బిలామ్ ఇశ్రాయేల్ పట్ల అభిమానం మరియు అసూయ యొక్క సంక్లిష్ట మిశ్రమాన్ని కలిగి ఉన్నాడు. ఇశ్రాయేల్ ను  శపించాలనే ఉద్దేశ్యంతో, అతను చివరికి వారిని ఆశీర్వదిస్తాడు, దైవిక ప్రేరణ మరియు ప్రవచనం యొక్క ప్రభావాన్ని వివరిస్తాడు. ఈ విరుద్ధమైన వైఖరి యూదు వ్యతిరేకత యొక్క విస్తృత థీమ్‌లను మరియు ఇష్టపడే పిల్లల మనోవిశ్లేషణ ప్రతిస్పందనను ప్రతిబింబిస్తుంది. తోరా విశ్వాసాన్ని నొక్కిచెబుతుంది, ఎందుకంటే ప్రార్థనా మందిరంలో మననం చేసే ప్రవచనం,యావత్ మానవాళిపై బలమైన దైవిక ప్రభావాన్ని సూచిస్తుంది, పవిత్రాత్మ పొందుకోవడానికి సర్వమానవాలికీ వున్న అవకాశాన్ని మిడ్రాష్ తన్నా దెబే ఎలియాహు యొక్క దృక్పథం ద్వారా నొక్కిచెబుతుంది.

మరణం నుండి నిత్యత్వం వరకు: శుద్ధికరణకు ఎర్రని పెయ్య మార్గము

పర్షత్ హుకత్ లో, ఎర్ర ఆవు (పారా అదుమా) ఆచారం మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షం యొక్క పాపంలో పాతుకుపోయిన మరణం యొక్క మలినాల నుండి శుద్ధిని సూచిస్తుంది. ఈ ఆచారంలో బూడిదను సజీవ నీటితో కలపడం, శరీరానికి మరియు ఆత్మకు ప్రాతినిధ్యం వహించడం, పునరుత్థానం ద్వారా జీవిత పునరుద్ధరణను వివరించడం జరుగుతుంది. ఈ ప్రక్రియ, దాని ప్రతీకాత్మక స్పష్టత ఉన్నప్పటికీ, ఒక దైవిక రహస్యాన్ని నొక్కిచెబుతుంది - జీవితం మరియు మరణం మధ్య పరివర్తన మానవ అవగాహనకు అతీతంగా ఉంటుంది. మిద్రాష్ ఎర్ర ఆవు యొక్క రహస్యాన్ని హైలైట్ చేస్తుంది, పునరుత్థానం మరియు దైవ సంకల్పం యొక్క లోతైన మరియు అస్పష్టమైన స్వభావాన్ని నొక్కి చెబుతుంది.

Search