Search

యూదియ నాయకత్వపు మూలాలపై యాకోబు ప్రభావం: ఒక పరిశీలన

యాకోబు మరణానికి ముందు అతని కుమారులలో ప్రతివొక్కనికి  నిర్దిష్టమైన ఆశీర్వాదాలను  ప్రవచనాలను అందించడమే  ఈ అధ్యాయంలో తన పిల్లలను ఒకచోటికి రప్పించడంలో యాకోబు ఉద్దేశ్యం. ఈ ఆశీర్వాదాలు, యాకోబు  తన ప్రేమను వ్యక్తీకరించడానికి మరియు అతని పిల్లలు వారి జీవితంలో వారి మార్గాల్లో కొనసాగుతున్నప్పుడు మార్గనిర్దేశం చేసేందుకు అనుమతించాయి. 'ప్రతిఒక్కరిని తన ఆశీర్వాదం ప్రకారం వారిని ఆశీర్వదించెను' అని వ్రాయబడింది. రూబెన్, షిమోన్ మరియు లేవీలతో పలికిన మాటలు పెద్దగా అనుకూలమైనవిగా అనిపించినప్పటికీ, తన కుమారులలో ఎవరు రాజ్యాధికారానికి అర్హులో రాజకీయంగా నాయకత్వం వహించగల సమర్థుడో వారికి వివరించడమే యాకోబు ఉద్దేశమని రబ్బీ ఐజాక్ అబర్బనేల్ వివరించారు. ఈ వివరణ ప్రధానంగా ఆశీర్వాదాల సారాంశాన్ని వివరిస్తుంది.

రూబేను, 'నీకు నీటివలె  చంచలత్వము కలదు.' ఓపిక లేని వ్యక్తి రాజకీయాలను నడిపించలేడు. రాజకీయాలకు సహనం అవసరం.

షిమోన్ మరియు లేవిల సంగతేంటి ? వారు మతోన్మాదులు, మత ఛాందసవాదులు. చరిత్రలో అసాధారణ సమయాల్లో ఉత్సాహం కొన్నిసార్లు ప్రయోజనకరంగా ఉంటుంది. కానీ దేశాన్ని నడిపించడానికి అన్ని వేళలా అత్యుత్సాహంతో నడుచుకోవడం సరికారు.

జెబులూన్ విషయమేంటి? జెబులూన్ 'సముద్రాల తీరంలో నివసిస్తాడు,' అంటే అతను విస్తృత, సార్వత్రిక సంస్కృతిని కలిగి ఉంటాడు మరియు తప్పనిసరిగా తన దేశానికి జరిగే మేలుకంటే ఈ ప్రాంతాన్ని ఆదరించడానికి మొగ్గు చూపుతాడు.  

మరి ఇస్సాకార్ గురించి ఏమిటి? 'ఒక దృఢమైన ఎముకగల గాడిద,' అతను తోరాను అధ్యయనం చేస్తాడు, ఇది రాజకీయ స్వాతంత్ర్యానికి ఎక్కువ విలువను ఇవ్వని దిశ.

అందుచేత అతనిగూర్చి ఈ విధంగా వ్రాయబడింది- “అతడు విశ్రాంతి మంచిదగుటయు ఆ భూమి రమ్యమైనదగుటయు చూచెను గనుక అతడు మోయుటకు భుజము వంచుకొని వెట్టి చేయు దాసుడగును.” 

ఇక దాన్ గురించి ఏమిటి? దాన్‌కి ఎలా పోరాడాలో తెలుసు, కానీ అతనికి తెలిసింది వీరుడైన సంసోనులా  గెరిల్లా యుద్ధాలు ఎలా చేయాలన్నది. ఇది  స్వాతంత్ర్య సాధనే లక్ష్యం అయినప్పుడు మంచిదే కానీ దేశం మొత్తానికి నాయకత్వం వహించడానికి తగినది కాదు...

మరోవైపు, 'గాదు, అతని నుండి ఒక దళం బయలుదేరడం' మనం చూస్తాము, అతను మొత్తం సైన్యాన్ని నడిపించగలడని అనిపిస్తుంది, కానీ వాక్యపు  కొనసాగింపు కూడా చదివినప్పుడు, 'అది తాను వెళ్ళిన మార్గంలో వెనకకు మరులుతుంది' అని పేర్కొంది. అతను జయించినప్పుడు, అతను జయించిన దిశలోనే తిరిగి రావాలనుకుంటాడు. ఆ భూమితో తనకు నిజమైన సంబంధం లేదనుకుంటాడు.

నఫ్తాలీ మరియు ఆషేరు విషయంలో కూడా అంతేనా? నఫ్తాలీ 'అందమైన పదాలు ఉచ్చరించే (ఇంపైనమాటలు పలుకును) వ్యక్తిగా ప్రసిద్ధి చెందాడు, అంటే అతను విద్యా మంత్రి కావచ్చు, సాంస్కృతిక మంత్రి కావచ్చు, ఆషేరు ఆర్థిక మంత్రి కావచ్చు మరియు “రాజులకు తగిన మధుర పదార్ధములను అందించవచ్చు”.

అయితే, నఫ్తాలీ కానీ, ఆషేరు కానీ సంపూర్ణమైన అవగాహన కలిగిలేరు. అందువల్ల వీరిద్దరూ దేశాన్ని నడిపించే అభ్యర్థులు కాదు.

 

యోసేపు సంగతేంటి?, పైన చెప్పిన వాటికి విరుద్దంగా పరాక్రమశాలియైన యాకోబు దేవుని హస్తములచే అతని చేతుల ఆయుధములు దృఢపరచబడెను  అతని విల్లు బలమైనదగును' అని వ్రాయబడి౦ది, కానీ ఆయన దేవుని ఆరాధనకు ఆకర్షి౦చబడలేదు, 'వారు ఆయనపై కక్షలు పెంచుకొని  గొడవపడ్డారు; అతన్ని అసహ్యించుకున్నారు." విలుకాండ్రు అతని వేధించిరి వారు బాణములను వేసి అతని హింసించారు. కాబట్టి, యోసేపు కొన్నిసార్లు మాత్రమే తన వ్యక్తిత్వం కారణంగా దేశాన్ని నడిపించగలడు.

బెన్యామీను సంగతేంటి? అతడు ఉదయమందు ఎరనుతిని అస్తమయమందు దోపుడుసొమ్ము పంచుకొనును." అతను సౌలు రాజు  వలె రాచరికం ప్రారంభంలో మరియు ఎస్తేర్ మరియు మోర్డెకై వలే రాచరికం చివరి అంఖంలో పాలించగలడు, కాని అతను చారిత్రక క్రమాన్ని కొనసాగించలేడు.

మరి యూదా సంగతేంటి? 'సింహం పిల్ల'. యూదా ప్రాథమికంగా ఒక పిల్ల, తరువాత సింహం, తరువాత సివంగి. 'కిమాహ్ కిమా' (קמעה קמעה) అంటే రాజకీయాల్లో సహనం వహించాలనే రహస్యం ఆయనకు తెలుసు, అందువలన అతను ఆరాధనను పొందుతాడు. " నీ తండ్రి కుమారులు నీ యెదుట సాగిలపడుదురు" ఆయన పాలించడానికి అర్హుడు.

[ఆదికాండము 49 నుండి]

More Weekly Portions

దైవిక మార్గదర్శకత్వం మరియు మానవ స్వరాలు: న్యాయ విధుల ఏర్పాటు

పరషత్ పీనెహాసు లో, సెలోపెహదు కుమార్తెలు యూదుల వారసత్వ చట్టాలలో ఒక కీలకమైన మార్పును ప్రేరేపించారు, ఇది కుమారులు లేనప్పుడు కుమార్తెలు వారసత్వంగా పొందడానికి అనుమతించే కొత్త ఆదేశాలకు దారితీసింది. ఈ కథనం దైవ మార్గదర్శకత్వం మరియు ప్రజల చొరవ మధ్య క్రియాశీలకమైన పరస్పర చర్యను వివరిస్తుంది. మొదట్లో అస్పష్టంగా ఉన్న మోషేకు, కుమార్తెలు ఆందోళన వ్యక్తం చేసిన తర్వాతే హాషెమ్ గారి నుండి నుంచి ఆదేశాలు అందాయి. ఈ కథ, ఇలాంటి వ్యాజ్యాలతో పాటు, మతపరమైన విచారణ మరియు ప్రతిస్పందన ద్వారా యూదుల చట్టం మరియు దైవ వెల్లడి యొక్క పరిణామంలో ప్రజల పాత్ర యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది.

ప్రశంస మరియు అసూయ : బాలాము ప్రవచనము లోని ద్వంద్వ స్వభావం

పరషత్ బాలక్‌లో, దేశాలలో ప్రసిద్ధి చెందిన ప్రవక్త అయిన బిలామ్ ఇశ్రాయేల్ పట్ల అభిమానం మరియు అసూయ యొక్క సంక్లిష్ట మిశ్రమాన్ని కలిగి ఉన్నాడు. ఇశ్రాయేల్ ను  శపించాలనే ఉద్దేశ్యంతో, అతను చివరికి వారిని ఆశీర్వదిస్తాడు, దైవిక ప్రేరణ మరియు ప్రవచనం యొక్క ప్రభావాన్ని వివరిస్తాడు. ఈ విరుద్ధమైన వైఖరి యూదు వ్యతిరేకత యొక్క విస్తృత థీమ్‌లను మరియు ఇష్టపడే పిల్లల మనోవిశ్లేషణ ప్రతిస్పందనను ప్రతిబింబిస్తుంది. తోరా విశ్వాసాన్ని నొక్కిచెబుతుంది, ఎందుకంటే ప్రార్థనా మందిరంలో మననం చేసే ప్రవచనం,యావత్ మానవాళిపై బలమైన దైవిక ప్రభావాన్ని సూచిస్తుంది, పవిత్రాత్మ పొందుకోవడానికి సర్వమానవాలికీ వున్న అవకాశాన్ని మిడ్రాష్ తన్నా దెబే ఎలియాహు యొక్క దృక్పథం ద్వారా నొక్కిచెబుతుంది.

మరణం నుండి నిత్యత్వం వరకు: శుద్ధికరణకు ఎర్రని పెయ్య మార్గము

పర్షత్ హుకత్ లో, ఎర్ర ఆవు (పారా అదుమా) ఆచారం మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షం యొక్క పాపంలో పాతుకుపోయిన మరణం యొక్క మలినాల నుండి శుద్ధిని సూచిస్తుంది. ఈ ఆచారంలో బూడిదను సజీవ నీటితో కలపడం, శరీరానికి మరియు ఆత్మకు ప్రాతినిధ్యం వహించడం, పునరుత్థానం ద్వారా జీవిత పునరుద్ధరణను వివరించడం జరుగుతుంది. ఈ ప్రక్రియ, దాని ప్రతీకాత్మక స్పష్టత ఉన్నప్పటికీ, ఒక దైవిక రహస్యాన్ని నొక్కిచెబుతుంది - జీవితం మరియు మరణం మధ్య పరివర్తన మానవ అవగాహనకు అతీతంగా ఉంటుంది. మిద్రాష్ ఎర్ర ఆవు యొక్క రహస్యాన్ని హైలైట్ చేస్తుంది, పునరుత్థానం మరియు దైవ సంకల్పం యొక్క లోతైన మరియు అస్పష్టమైన స్వభావాన్ని నొక్కి చెబుతుంది.

Search