Search

మూర్తీభవించిన పవిత్రత- విశ్రాంతి దిన పవిత్రత మరియు ప్రత్యక్షగుడారం యొక్క సేవ

ప్రత్యక్ష గుడారం లో ఆజ్ఞలకు, విశ్రా౦తి దిన౦లో ఆజ్ఞలకు మధ్య గల ఆవశ్యకమైన స౦బ౦ధ౦.

పరషత్ "వాయఖేల్" ప్రారంభంలో ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించే పనిని మోషే ప్రకటించినప్పుడు, తోరాహ్ విశ్రాంతి దిన ఆజ్ఞలకు అనేక వచనాలను జోడించింది.

విశ్రా౦తి దిన౦లోని ఆజ్ఞల గురి౦చి ప్రస్తావి౦చడ౦ అయోమయ౦గా అనిపిస్తు౦ది, ఎ౦దుక౦టే ప్రత్యక్ష గుడారాన్ని ఎలా నిర్మి౦చాలో ఆ భాగ౦ మొత్తం చర్చిస్తు౦ది. అలాంటప్పుడు, పరాష ప్రారంభoలో సబ్బాత్ గురించి ఎందుకు ప్రస్తావిస్తారు? విశ్రా౦తి దిన ఆజ్ఞలకు, పరిశుద్ధాలయ ఆజ్ఞలకు మధ్య ఒక ముఖ్యమైన స౦బ౦ధ౦ ఉ౦ది. పరిశుద్ద స్థల నిర్మాణం విశ్రాంతి దినాన జరగకూడదని పాఠం చెబుతోందని మా జ్ఞానులు మాకు బోధించారు. 

కాబట్టి, విశ్రా౦తి దిన౦లో గుడారాన్ని నిర్మి౦చుట నిషిద్దము, అనగా విశ్రా౦తి దిన౦లో గుడార నిర్మాణపు పనులు చేయడ౦ నిషేధము అనేది, విశ్రా౦తి దిన౦లోని నిషిద్ధమైన పనులు అనగా గుడారపు పనులు అని మనకు బోధిస్తో౦ది! గుడారాన్ని నిర్మి౦చడానికి అవసరమైన ముప్పై తొమ్మిది పనులు విశ్రా౦తి దినాన నిషేధి౦చబడిన పనులే. 

సబ్బాత్ ఆచరించడం ద్వారా సమయములోని పరిశుద్ధతను వెల్లడి చేయడం జరుగుతుంది, మరియు స్థల సంబందిత పవిత్రత అనేది దేవాలయం ద్వారా  వెల్లడి అవుతుంది. 

విశ్రాంతి దినం అనేది సమయంలోని 'పరిశుద్ద స్థలo'. సబ్బాత్ రోజే మరొక  ‘పరిశుద్ద స్థలo' నిర్మించాల్సిన అవసరం లేదు. సబ్బాత్ రోజున ‘పరిశుద్ద స్థలo' ఎలా వ్యక్తీకరించబడుతుంది? ఇది 'కాల పవిత్రత' ద్వారా, విశ్రాంతి దిన భోజనం ద్వారా, విశ్రాంతి దినం యొక్క ప్రార్థనల ద్వారా మరియు విశ్రాంతి దినం యొక్క మిగిలిన భాగాల ద్వారా జరుగుతుంది. వారానికి ఒకసారి, సబ్బాత్ రోజున, మనము సంపూర్ణమైన  ప్రపంచంలో ఉంటాము. 

అదేవిధంగా, పరిశుద్ద స్థలము(ఈ భాగంలో నిర్మించమని మోషేకు ఆజ్ఞాపించబడిన పరిశుద్ద స్థలం) విశ్రాంతి దినపు పవిత్రతను ప్రదేశానికి మరియు స్థలానికి బదిలీ చేస్తుంది. దీని సారాంశాన్ని బట్టి, మానవ ప్రపంచంలో పరిపూర్ణ ప్రపంచాన్ని వెల్లడించడానికి సమయం లేదా ప్రదేశం అనే రెండు మార్గాలు ఉన్నాయి. 

నిర్ధిష్టంగా ముప్పై తొమ్మిది పనులు అనే సంఖ్యను ఎలా చేరుకున్నాం? 

ఇది చాలా సింపుల్. తోరా రహస్యాల ప్రాచీన గ్రంధాలలో ఒకటైన "సెఫర్ యెట్జీరా" లో, ప్రపంచం ఇరవై రెండు అక్షరాలతో (హీబ్రూ అక్షరమాల) మరియు పది సంఖ్యలతో (ఒకటి నుండి పది వరకు) సృష్టించబడిందని మనము తెలుసుకున్నాము. ప్రపంచం యొక్క నిర్మాణం ఆ ముప్పై రెండు మార్గాలు మరియు ఇరవై రెండు అక్షరాలతో కూడిన మార్గాలపై నిర్మించబడిందని, నాణ్యత ప్రపంచాన్ని వ్యక్తీకరిస్తుంది, అదనంగా పది సంఖ్యలు పరిమాణ ప్రపంచాన్ని వ్యక్తపరుస్తాయి. 

ఇప్పటివరకు, మనము ముప్పై తొమ్మిది పనులని వివరించాము (22+10) . కానీ ఆగండి, మరో ఏడు ఎలా వచ్చాయి? ఏడు అక్షరాలు వాటి ఉచ్చారణ విధానంలో రెండువిధాలుగా ప్రవర్తిస్తాయని తెలుసుకోవడం అవసరం. ఒకసారి, వాటిని మృదువుగా ఉచ్ఛరించవచ్చు, కానీ ఆ ఏడు అక్షరాలను ఒత్తి పలికినప్పుడు, వాటి ఉచ్చరణ విధానం మార్పుచెందుతుంది. వాటి వ్యక్తీకరణ బలోపేతమవుతుంది. 

ఉదాహరణకు, (ఆంగ్ల అక్షరం 'ఎఫ్' కు సరిసమానమైన) 'ఫే' అనే అక్షరాన్ని కొంచం నొక్కి పలికినప్పుడు [అక్షరాన్ని బలోపేతం చేయడంవల్ల],  ('పి' అక్షరానికి సరిసమానంగా) అది బలంగా ఉచ్ఛరించబడుతుంది. హీబ్రూ భాషలో ఇలాంటి అక్షరాలు ఏడు ఉన్నాయి! మొదట్లో చెప్పిన ఆ ముప్పైరెండు అక్షరాలతో పాటు మరో ఏడు అక్షరాలను కలిపితే, అది ముప్పై తొమ్మిది [32+7=39]గా మారుతుంది, ఇది ప్రత్యక్షగుడారంలో దానిని నిర్మించడానికి మరియు నిలబెట్టడాకి చేసిన ముప్పై తొమ్మిది పనులకు  సమానమైనది. 

సబ్బాత్ పనుల వివరాలను లోతుగా పరిశీలించి, అవి ఏ అక్షరం లేదా సంఖ్యకు అనుగుణంగా ఉన్నాయో చూడవచ్చు. ఈ తక్కువ సమయంలో ఈ భాగం యొక్క పూర్తి వివరణను వివరించలేము; ఆసక్తి ఉన్నవారి ఉత్సుకతకు దీనిని వదిలేస్తున్నాం.

ప్రతి నోవాహీయుడు సబ్బాత్ రోజున ఎలా ప్రవర్తించాలి? ఒక నోవాహీయుడు విశ్రా౦తి దినాన్ని పూర్తిగా ఆచరి౦చడానికి అనుమతి౦చబడ్డాడా? ఇశ్రాయేలీయుల వలె ఆయన విశ్రా౦తి దినాన్ని ఆచరి౦చడ౦ సముచితమేనా? 'బ్రిత్ ఓలామ్ - డైలీ లాస్ ఫర్ నోవాహైడ్స్' అనే పుస్తకంలో మీరు దీన్ని ఇంకా మరెన్నో చూడవచ్చు. 

యెరూషలేము నుండి ఆశీర్వాదాలు.

>

More Weekly Portions

దైవిక మార్గదర్శకత్వం మరియు మానవ స్వరాలు: న్యాయ విధుల ఏర్పాటు

పరషత్ పీనెహాసు లో, సెలోపెహదు కుమార్తెలు యూదుల వారసత్వ చట్టాలలో ఒక కీలకమైన మార్పును ప్రేరేపించారు, ఇది కుమారులు లేనప్పుడు కుమార్తెలు వారసత్వంగా పొందడానికి అనుమతించే కొత్త ఆదేశాలకు దారితీసింది. ఈ కథనం దైవ మార్గదర్శకత్వం మరియు ప్రజల చొరవ మధ్య క్రియాశీలకమైన పరస్పర చర్యను వివరిస్తుంది. మొదట్లో అస్పష్టంగా ఉన్న మోషేకు, కుమార్తెలు ఆందోళన వ్యక్తం చేసిన తర్వాతే హాషెమ్ గారి నుండి నుంచి ఆదేశాలు అందాయి. ఈ కథ, ఇలాంటి వ్యాజ్యాలతో పాటు, మతపరమైన విచారణ మరియు ప్రతిస్పందన ద్వారా యూదుల చట్టం మరియు దైవ వెల్లడి యొక్క పరిణామంలో ప్రజల పాత్ర యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది.

ప్రశంస మరియు అసూయ : బాలాము ప్రవచనము లోని ద్వంద్వ స్వభావం

పరషత్ బాలక్‌లో, దేశాలలో ప్రసిద్ధి చెందిన ప్రవక్త అయిన బిలామ్ ఇశ్రాయేల్ పట్ల అభిమానం మరియు అసూయ యొక్క సంక్లిష్ట మిశ్రమాన్ని కలిగి ఉన్నాడు. ఇశ్రాయేల్ ను  శపించాలనే ఉద్దేశ్యంతో, అతను చివరికి వారిని ఆశీర్వదిస్తాడు, దైవిక ప్రేరణ మరియు ప్రవచనం యొక్క ప్రభావాన్ని వివరిస్తాడు. ఈ విరుద్ధమైన వైఖరి యూదు వ్యతిరేకత యొక్క విస్తృత థీమ్‌లను మరియు ఇష్టపడే పిల్లల మనోవిశ్లేషణ ప్రతిస్పందనను ప్రతిబింబిస్తుంది. తోరా విశ్వాసాన్ని నొక్కిచెబుతుంది, ఎందుకంటే ప్రార్థనా మందిరంలో మననం చేసే ప్రవచనం,యావత్ మానవాళిపై బలమైన దైవిక ప్రభావాన్ని సూచిస్తుంది, పవిత్రాత్మ పొందుకోవడానికి సర్వమానవాలికీ వున్న అవకాశాన్ని మిడ్రాష్ తన్నా దెబే ఎలియాహు యొక్క దృక్పథం ద్వారా నొక్కిచెబుతుంది.

మరణం నుండి నిత్యత్వం వరకు: శుద్ధికరణకు ఎర్రని పెయ్య మార్గము

పర్షత్ హుకత్ లో, ఎర్ర ఆవు (పారా అదుమా) ఆచారం మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షం యొక్క పాపంలో పాతుకుపోయిన మరణం యొక్క మలినాల నుండి శుద్ధిని సూచిస్తుంది. ఈ ఆచారంలో బూడిదను సజీవ నీటితో కలపడం, శరీరానికి మరియు ఆత్మకు ప్రాతినిధ్యం వహించడం, పునరుత్థానం ద్వారా జీవిత పునరుద్ధరణను వివరించడం జరుగుతుంది. ఈ ప్రక్రియ, దాని ప్రతీకాత్మక స్పష్టత ఉన్నప్పటికీ, ఒక దైవిక రహస్యాన్ని నొక్కిచెబుతుంది - జీవితం మరియు మరణం మధ్య పరివర్తన మానవ అవగాహనకు అతీతంగా ఉంటుంది. మిద్రాష్ ఎర్ర ఆవు యొక్క రహస్యాన్ని హైలైట్ చేస్తుంది, పునరుత్థానం మరియు దైవ సంకల్పం యొక్క లోతైన మరియు అస్పష్టమైన స్వభావాన్ని నొక్కి చెబుతుంది.

Search