Search

Parashat Ekev
ఆత్మకు పోషణ: భోజన అనంతరం ప్రతిసారి చేయు మనఃపూర్వక స్తుతుల యాత్ర

(ఆజ్ఞ) మిట్స్‌వా: భోజన అనంతర దీవెన

 

పరాషా ఎకెవ్ లోని అత్యంత ప్రధానమైన మిట్స్‌వోత్ లో ఒకటి ఇశ్రాయేలియులు ఇశ్రాయేలు భూమిలోనికి ప్రవేశించబోతున్నారు అనే వాస్తవంతో సంబంధం కలిగివుంది. అది గోధుమ మరియు బార్లీ, ద్రాక్షలు, అంజూరాలు, దానిమ్మకాయలు, మొదలగు పండ్లతో నిండిన సారవంతమైన భూమియని తోరా వాగ్ధానం చేస్తుంది.  వీటన్నిటిగురించి ఇలా చెప్పబడింది :

 “నీవు తిని, తృప్తి పొంది నీ దేవుడైన అదోనాయ్ ను దీవింపవలెను.”

ఈ ఆజ్ఞ, ఇశ్రాయేలు ప్రజలు ఆ భూమిలోనికి ప్రవేశించే సంధర్భంలో చెప్పబడినప్పటికీ, ఈ దీవెన సార్వజనీనమైనది.  మిద్రాష్ లోని కథలలో, అబ్రహాము తన గుడారములో అతిధులను ఆహ్వానించేప్పుడు, ఏ జాతికి చెందిన ప్రజలైనా, వారికి భోజనం ఏర్పాటుచేసి, ఆతరువాత భోజనము నిమిత్తము కృతజ్ఞత చెప్పమని కోరేవాడు.  దానికి బదులుగా వారు అబ్రహాము మరియు తన భార్యయైన సారాకు కృతజ్ఞతలు చెప్పడం ప్రారంభించేవారు.  అడ్డుపడి, అబ్రహాము వారిని ఆపి, విశ్వాన్ని దానిలోని సమస్తమునూ సృజించిన ఆ ఒక్కనికి కృతజ్ఞత చెప్పమని సూచించేవాడు. సృష్టికర్త పట్ల మన విశ్వాసమును కనుపరచుటకు మన ఆహారంపై దీవెన చెప్పాలి అనే  మిట్స్‌వా యొక్క మూలము ఇదే.

 మన పితరుడైన అబ్రహాము దేవుని ఉనికికి సంబంధించిన ఆధారాలను చూపించడానికి, భౌతికతత్వానికి బాహ్యమైన విషయాలో లేదా తాత్వికమైన ఆధారాలో చూపించలేదని గమనించాలి. దానికి బదులు తన మనుగడ బాహ్యమైన దానినుండి వెలువడిందని తన అతిధులు గుర్తెరిగే విధంగా  ఒక సంధార్భాన్ని కలుగజేశాడు. భోజనం చేసేటప్పుడు జరిగేది ఇదే. మనం తినేటప్పుడు, మనము “స్వీకరించేవారము” గా ఉండాల్సి వుందని  అంగీకరించాలి. అనగా మనము  సృజింపబడినవారమని, మన  మనుగడ మనతోనే ప్రారంభం కాలేదని గుర్తిస్తాము. అదేవిధంగా, ఎవరైతే తాము సృజింపబడినవారము అని గుర్తెరుగుతారో, వారికి సృష్టికర్త ఉన్నాడు అని అర్ధమౌతుంది. ఇదే యూదత్వము యొక్క పునాధి. 

 మన విశ్వాసమంతటిలో, మనం చేసే ప్రార్ధనలన్నిటిలో, కేవలము భోజనానంతరము చేసే ప్రార్ధన మాత్రమే తప్పనిసరిగా చేయాలని తోరా ఆక్షేపించింది. సీనాయి వద్ద తోరా బయల్పరచబడిన విషయం కంటే, ఆహారము గురించిన సందేశము ఇక్కడ సూచింపబడింది.  దీనిలోని ప్రధానమైన సమాచారము ఏదనగా, హషేమ్ గారే సమస్త విశ్వానికి పోషకుడై ఉన్నాడు. అందరిపట్లా ఆయన దయ కలిగి ఉన్నాడు. అందవల్ల, ఆహారముకొరకు దీవెన చెప్పడం అనే మిట్స్‌వా సమస్త దేశాలపైనా భాద్యతగా ఉన్నది. దేవుని పోలిక (బెట్సెల్లెం) చొప్పున సృజింపబడిన  ప్రతి జీవికి ఈ నియమము వర్తిస్తుంది. నోవహీయ విశ్వాసము చొప్పున జీవించు వ్యక్తి కూడా, బెరిత్ ఒలామ్ ప్రార్ధన పుస్తకములో వివరించిన రీతిగా  భోజనానంతర దీవెన (బిర్కత్  హ మాజోన్)  ఖచితముగా చెప్పాలి. ఆ గ్రంధములో సమస్త దేశాల సభ్యులందరికి సరిపదేవిధంగా, “భోజనము తరువార దీవెనలు” అను ఒక భాగాన్ని మేము పొందుపరిచాము.

More Weekly Portions

దైవిక మార్గదర్శకత్వం మరియు మానవ స్వరాలు: న్యాయ విధుల ఏర్పాటు

పరషత్ పీనెహాసు లో, సెలోపెహదు కుమార్తెలు యూదుల వారసత్వ చట్టాలలో ఒక కీలకమైన మార్పును ప్రేరేపించారు, ఇది కుమారులు లేనప్పుడు కుమార్తెలు వారసత్వంగా పొందడానికి అనుమతించే కొత్త ఆదేశాలకు దారితీసింది. ఈ కథనం దైవ మార్గదర్శకత్వం మరియు ప్రజల చొరవ మధ్య క్రియాశీలకమైన పరస్పర చర్యను వివరిస్తుంది. మొదట్లో అస్పష్టంగా ఉన్న మోషేకు, కుమార్తెలు ఆందోళన వ్యక్తం చేసిన తర్వాతే హాషెమ్ గారి నుండి నుంచి ఆదేశాలు అందాయి. ఈ కథ, ఇలాంటి వ్యాజ్యాలతో పాటు, మతపరమైన విచారణ మరియు ప్రతిస్పందన ద్వారా యూదుల చట్టం మరియు దైవ వెల్లడి యొక్క పరిణామంలో ప్రజల పాత్ర యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది.

ప్రశంస మరియు అసూయ : బాలాము ప్రవచనము లోని ద్వంద్వ స్వభావం

పరషత్ బాలక్‌లో, దేశాలలో ప్రసిద్ధి చెందిన ప్రవక్త అయిన బిలామ్ ఇశ్రాయేల్ పట్ల అభిమానం మరియు అసూయ యొక్క సంక్లిష్ట మిశ్రమాన్ని కలిగి ఉన్నాడు. ఇశ్రాయేల్ ను  శపించాలనే ఉద్దేశ్యంతో, అతను చివరికి వారిని ఆశీర్వదిస్తాడు, దైవిక ప్రేరణ మరియు ప్రవచనం యొక్క ప్రభావాన్ని వివరిస్తాడు. ఈ విరుద్ధమైన వైఖరి యూదు వ్యతిరేకత యొక్క విస్తృత థీమ్‌లను మరియు ఇష్టపడే పిల్లల మనోవిశ్లేషణ ప్రతిస్పందనను ప్రతిబింబిస్తుంది. తోరా విశ్వాసాన్ని నొక్కిచెబుతుంది, ఎందుకంటే ప్రార్థనా మందిరంలో మననం చేసే ప్రవచనం,యావత్ మానవాళిపై బలమైన దైవిక ప్రభావాన్ని సూచిస్తుంది, పవిత్రాత్మ పొందుకోవడానికి సర్వమానవాలికీ వున్న అవకాశాన్ని మిడ్రాష్ తన్నా దెబే ఎలియాహు యొక్క దృక్పథం ద్వారా నొక్కిచెబుతుంది.

మరణం నుండి నిత్యత్వం వరకు: శుద్ధికరణకు ఎర్రని పెయ్య మార్గము

పర్షత్ హుకత్ లో, ఎర్ర ఆవు (పారా అదుమా) ఆచారం మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షం యొక్క పాపంలో పాతుకుపోయిన మరణం యొక్క మలినాల నుండి శుద్ధిని సూచిస్తుంది. ఈ ఆచారంలో బూడిదను సజీవ నీటితో కలపడం, శరీరానికి మరియు ఆత్మకు ప్రాతినిధ్యం వహించడం, పునరుత్థానం ద్వారా జీవిత పునరుద్ధరణను వివరించడం జరుగుతుంది. ఈ ప్రక్రియ, దాని ప్రతీకాత్మక స్పష్టత ఉన్నప్పటికీ, ఒక దైవిక రహస్యాన్ని నొక్కిచెబుతుంది - జీవితం మరియు మరణం మధ్య పరివర్తన మానవ అవగాహనకు అతీతంగా ఉంటుంది. మిద్రాష్ ఎర్ర ఆవు యొక్క రహస్యాన్ని హైలైట్ చేస్తుంది, పునరుత్థానం మరియు దైవ సంకల్పం యొక్క లోతైన మరియు అస్పష్టమైన స్వభావాన్ని నొక్కి చెబుతుంది.

Search