Liquid error (sections/custom_mobile-menu line 86): Expected handle to be a String but got LinkListDrop
  • Group 27 Login

తాత్కాలికత నుండి శాశ్వతత్వం వరకు: నిర్గమము నందు మరియు దాని తరువాత దైవిక ఉనికి

ఇశ్రాయేలు ప్రజల ఏర్పాటు యొక్క కథను చెప్పే ఆధికాండ గ్రంధమునకు భిన్నంగా, నిర్గమ కాండ గ్రంధము ఇశ్రాయేలియులలో దైవిక ఉనికి అభివ్యక్తమవ్వడాన్ని వివరిస్తుంది. అంటే, దేశం లోపల ఉన్న దైవిక ఉనికి, అది తదనంతరం మొత్తం ప్రపంచానికి ప్రసరిస్తుంది. ఈ విధంగా, ఈ పుస్తకం (నిర్గమకాండము) పెకుడెయి యొక్క భాగంతో ముగుస్తుంది, ఇది ప్రత్యక్ష గుడారంలోని దైవిక ఉనికి యొక్క ప్రేరణను వర్ణిస్తుంది. ఏ గుడారాన్ని సూచిస్తారు? ఇశ్రాయేలీయులు ఇంకా ఎడారిలో ఉన్నారు. ఇంకా యరుషలేము చేరుకోలేదు కాబట్టి ఇది, "మిష్కాన్" అనగా ప్రయాణపు గుడారము. 

 ఒక ప్రశ్న తలెత్తుతుంది: మేము ఇక్కడ నుండి ముందుకు ఎలా కొనసాగాలి? ఇక్కడ, తోరా యొక్క కాలక్రమానుసారం మనకు ఒక విషయం ఆశ్చర్యం కలిగిస్తుంది: మనకు రెండు సమకాలీన పుస్తకాలు ఉన్నాయి: లేవీయకాండము మరియు సంఖ్యాకాండము. 

లేవికాండ  గ్రంథం ప్రత్యక్షపు గుడారములోని పెకుదేయి భాగంలో దైవిక ఉనికిని ప్రేరేపించిన వెంటనే జరుగుతుంది. ఇశ్రాయేలీయులు కదలకుండా ఉండగా, లేవికాండ గ్రంథం మొత్తం సీనాయి పర్వతం పాదాల వద్ద సంభవిస్తుంది. ఇంతలో, సంఖ్య కాండ గ్రంధము అనేది ఎడారి గుండా ఇశ్రాయేలు ప్రజల నిరంతర ప్రయాణం చేస్తున్నప్పటి గ్రంధం. కాలక్రమానుసారంగా ఉన్నప్పటికీ, ఈ రెండు గ్రంధాలు ఒకదానికొకటి సమాంతరంగా ఉన్నాయి. 

దీన్ని మనం నిజంగా ఎలా అర్థం చేసుకోవాలి?  మన తోరా భాగం- పెకుదేయి భాగం చివరిలో, ప్రత్యక్షపు గుడారం గురించి ఇలా వ్రాయబడింది: "మరియు మేఘము గుడారమును కప్పివేసెను, మరియు ప్రభువు మహిమ మిష్కాన్‌ను నింపెను, మరియు మోషే లోపలికి ప్రవేశించలేకపోయెను. ఎందుకనగా ప్రత్యక్షపు  గుడారము మేఘముతో ఆవరించేను మరియు ప్రభువు మహిమ మిష్కాన్ (అంటే గుడారం)ని నింపియుండెను." ఈ పరిస్థితి శాశ్వతమైనది; గుడారాన్ని నింపివుంచిన ప్రభువు మహిమ - అగ్ని. గుడారాన్ని ఆవరించిన మేఘం- నీరు. 

కాబట్టి, మునుపటి పేరాలో పేర్కొన్న వచనం లేవీకాండమునకు ఉపోధ్గాతము. దైవిక సన్నిధి నివసించిన తరువాత, పవిత్రుడు, స్తుతిపాత్రుడైన దేవుడు, మోషేను గుడారంలోకి పిలిచి, అతనికి బలుల నియమాలను తెలియజేశాడు. కానీ, వెంటనే, "మిష్కాన్ మీద నుండి మేఘం పైకి లేచినప్పుడు, ఇశ్రాయేలు ప్రజలు తమ ప్రయాణాలకు బయలుదేరారు" అని చెప్పబడింది. ఇది సంఖ్యకాండమునకు ఉపోధ్గాతం. "కానీ మేఘం పైకి లేవకపోతే, అది పైకి లేచే రోజు వరకు వారు బయలుదేరలేదు. ఎందుకంటే ప్రభువు యొక్క మేఘం పగటిపూట మిష్కాన్ మీద ఉంది, మరియు రాత్రి దానిలో అగ్ని, మొత్తం. ఇశ్రాయేలు ఇంటివారి కళ్ళ ముందు తమ ప్రయాణాలన్నింటిలోను ఉండెను." ఇశ్రాయేలీయులందరి కళ్లముందు ఉందా? ఇది తోరాలోని చివరి వచనం గురించి మనకు గుర్తు చేస్తుంది, ఆ వచనం "ఇశ్రాయేలు ప్రజలందరి కళ్ళ ముందు" అనే పదాలతో ముగుస్తుంది. 

కాబట్టి, అలా అయితే, తోరాను అక్కడ ముగించడం సాధ్యమయ్యేది. కానీ తోరా మరో రెండు పదాలను జతచేస్తుంది, " ఇశ్రాయేలు ఇంటి వారిఅందరి  ప్రయాణాలన్నిటిలో వారి కళ్ళ ముందు," అంటే, ప్రత్యేక్ష గుడారం దాని తుది స్థానంలో కాకుండా తాత్కాలికంగా ఎడారిలో చేయబడింది. అందువల్ల, ఇది ఇంకా ప్రయాణించాల్సిన అవసరం ఉంది. నిజమే, దైవసన్నిధి ప్రత్యేక్ష గుడారంలో పనిచేసింది, కానీ – అది ఇశ్రాయేల్  దేశానికి బదిలీ చేయబడాలి, మరియు ఈ అవసరం కారణంగా, వారు విశ్రాంతికి వచ్చి స్వాస్త్యాన్ని పొందుకోనెవరకు, తోరాలోని లెవీకాండము, సంఖ్యకాండము, ద్వితీయోపదేశకాండము అను గ్రంధాల ద్వారా మరింత కొనసాగింపు జరిగింది.

More Weekly Portions

దైవిక మార్గదర్శకత్వం మరియు మానవ స్వరాలు: న్యాయ విధుల ఏర్పాటు

పరషత్ పీనెహాసు లో, సెలోపెహదు కుమార్తెలు యూదుల వారసత్వ చట్టాలలో ఒక కీలకమైన మార్పును ప్రేరేపించారు, ఇది కుమారులు లేనప్పుడు కుమార్తెలు వారసత్వంగా పొందడానికి అనుమతించే కొత్త ఆదేశాలకు దారితీసింది. ఈ కథనం దైవ మార్గదర్శకత్వం మరియు ప్రజల చొరవ మధ్య క్రియాశీలకమైన పరస్పర చర్యను వివరిస్తుంది. మొదట్లో అస్పష్టంగా ఉన్న మోషేకు, కుమార్తెలు ఆందోళన వ్యక్తం చేసిన తర్వాతే హాషెమ్ గారి నుండి నుంచి ఆదేశాలు అందాయి. ఈ కథ, ఇలాంటి వ్యాజ్యాలతో పాటు, మతపరమైన విచారణ మరియు ప్రతిస్పందన ద్వారా యూదుల చట్టం మరియు దైవ వెల్లడి యొక్క పరిణామంలో ప్రజల పాత్ర యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది.

ప్రశంస మరియు అసూయ : బాలాము ప్రవచనము లోని ద్వంద్వ స్వభావం

పరషత్ బాలక్‌లో, దేశాలలో ప్రసిద్ధి చెందిన ప్రవక్త అయిన బిలామ్ ఇశ్రాయేల్ పట్ల అభిమానం మరియు అసూయ యొక్క సంక్లిష్ట మిశ్రమాన్ని కలిగి ఉన్నాడు. ఇశ్రాయేల్ ను  శపించాలనే ఉద్దేశ్యంతో, అతను చివరికి వారిని ఆశీర్వదిస్తాడు, దైవిక ప్రేరణ మరియు ప్రవచనం యొక్క ప్రభావాన్ని వివరిస్తాడు. ఈ విరుద్ధమైన వైఖరి యూదు వ్యతిరేకత యొక్క విస్తృత థీమ్‌లను మరియు ఇష్టపడే పిల్లల మనోవిశ్లేషణ ప్రతిస్పందనను ప్రతిబింబిస్తుంది. తోరా విశ్వాసాన్ని నొక్కిచెబుతుంది, ఎందుకంటే ప్రార్థనా మందిరంలో మననం చేసే ప్రవచనం,యావత్ మానవాళిపై బలమైన దైవిక ప్రభావాన్ని సూచిస్తుంది, పవిత్రాత్మ పొందుకోవడానికి సర్వమానవాలికీ వున్న అవకాశాన్ని మిడ్రాష్ తన్నా దెబే ఎలియాహు యొక్క దృక్పథం ద్వారా నొక్కిచెబుతుంది.

మరణం నుండి నిత్యత్వం వరకు: శుద్ధికరణకు ఎర్రని పెయ్య మార్గము

పర్షత్ హుకత్ లో, ఎర్ర ఆవు (పారా అదుమా) ఆచారం మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షం యొక్క పాపంలో పాతుకుపోయిన మరణం యొక్క మలినాల నుండి శుద్ధిని సూచిస్తుంది. ఈ ఆచారంలో బూడిదను సజీవ నీటితో కలపడం, శరీరానికి మరియు ఆత్మకు ప్రాతినిధ్యం వహించడం, పునరుత్థానం ద్వారా జీవిత పునరుద్ధరణను వివరించడం జరుగుతుంది. ఈ ప్రక్రియ, దాని ప్రతీకాత్మక స్పష్టత ఉన్నప్పటికీ, ఒక దైవిక రహస్యాన్ని నొక్కిచెబుతుంది - జీవితం మరియు మరణం మధ్య పరివర్తన మానవ అవగాహనకు అతీతంగా ఉంటుంది. మిద్రాష్ ఎర్ర ఆవు యొక్క రహస్యాన్ని హైలైట్ చేస్తుంది, పునరుత్థానం మరియు దైవ సంకల్పం యొక్క లోతైన మరియు అస్పష్టమైన స్వభావాన్ని నొక్కి చెబుతుంది.

Search