Search

శీర్షిక: ప్రపంచాల సామరస్యత : యాకోబు, ఏశావు, మరియు ద్వంద్వ వారసత్వం కొరకు పోరాటం

అబ్రహాము మరియు ఇస్సాకు  యొక్క ఆదర్శాలను సూచిస్తూ, యాకోబు  మరియు ఏసావులు నిదర్శనంగా వున్న భిన్న దృక్పధాలను తోల్దోత్ భాగము పరిశీలిస్తుంది. రిబ్కా గర్భంలోని పెనుగులాట  భౌతిక మరియు ఆధ్యాత్మిక రంగాలపై వారి వివాదాన్ని సూచిస్తుంది. ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపిన యాకోబు , భౌతిక ప్రపంచాన్ని పునరుద్దరించడం మరియు వారసత్వంగా పొందడం కోసం పట్టుబడుతున్నాడు. చారిత్రాత్మక సవాళ్లు ఉన్నప్పటికీ, సియోన్  మరియు ఇజ్రాయెల్ స్థాపనకు తిరిగి వచ్చినప్పుడు యూదులు ప్రపంచంతో రాజీపడతారు. ఏసావు యొక్క వారసులు (రోమ్) భౌతికత్వంపై ఆధిపత్యం చెలాయిస్తారు. అయితే  రాబోయే ప్రపంచం విషయంలో  క్రైస్తవ సిద్దాంతంలో హామీని కోరుకుంటారు. తోల్దోత్ భాగము యాకోబు ఏవిధంగా మార్పు చెందాడన్న  ప్రయాణాన్ని వర్ణిస్తుంది, రెండు ప్రపంచాలను ఏకీకృతం చేసి యాకోబు ఇజ్రాయెల్‌గా ఎలా పరిణామం చెందాడో తెలియజేస్తుంది.

Search